పుట:NagaraSarwaswam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12


మదనాసంగతః సిక్ధః సంరాగో రక్తవేష్టనమ్,
పంచబాణ క్షత త్త్వేతు పంచాంగుళి సుఖక్షతిః-

ఇంతకుముందు మన్మధవ్యాపారము లేదనుటకు మైనము, నీయం దెక్కువ యనురాగము కలదనుటకు ఎఱ్రదారము చుట్టుట, మన్మధుని ఐదు బాణములు తన మనస్సుననాటి యుస్నవని తెలుపుటకు ఐదు గోళ్ళతో గ్రుచ్చుట సంకేతములై ఉన్నాయి. శాస్త్రమున దీనికి పోటలీ యనిపేరు.

అజయుడు వెంటనే ఇటునటు పరికించి అచ్చటనున్న చక్కని వస్త్రఖండాన్ని తెచ్చి, దానికి చిల్లులు పొడిచి యామైసపు ముద్ద కంటించాడు. పరిచారిక పళ్ళెరాన్ని లోనికి గొనిపోయింది.

"స్మరేణోద్భిన్న దేహత్త్వే సచ్ఛిద్రం వస్తముత్తమం”

అని శాస్త్రము, అనగా-మస్మధునిచే నా దేహము చిల్లులుపడినదని సూచించుటకు చిల్లులు పడిన వస్త్రము సంకేతము. అజయుడు చిల్లులు పొడిచిన వస్త్రమంపుట ద్వారా రాకుమారియొక్క సంకేతమునుగుర్తించినటులేకాక తానుకూడ మదనునిచే పీడింపబడుచున్నట్లు చూచించాడు.

కొంతసమయానికి పరిచారిక వేరొక పళ్ళెరాన్ని తెచ్చి రాకుమారుని యెదుట ఉంచింది. ఆ పళ్ళెమునందు తమలపాకులు చిత్రముగా చుట్టబడి నాలుగుమూలలయందు లవంగ మొగ్గలచే గ్రుచ్చుబడిఉన్నాయి ఆ లవంగములు నాలుగు నాలుగుకోళ్ళవలె నుండగా చుట్టబడిన తమలపాకులు పరుపుతోకూడిన మంచమువలె ఉన్నాయి.

"పర్యంక స్సంగమాశయా"

అని శాస్త్రము. అనగా-నేను నిన్నుకలియ గోరుచున్నాను, అనుటకు పర్యంకముయొక్క. ఆకారముగల తాంబూలము సంకేతము.

అజయుడు దాని భావము గ్రహించి ప్రక్కనున్న గంధపు గిన్నెలోని గంధమునింతదీసి యా తాంబూలముపై అంటించాడు. పరిచారిక పళ్ళెమును లోనికి దీసికొనిపోయింది.