పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

347



చిరి. ఆరెండవపని యిది. మైసూరు మహారాజుగారి యంతఃపురమున నున్న చరాస్థి కంతకు జాబితా తయారుచేసి, ప్రతివస్తువు యొక్క విలువ దాని కెదురుగావ్రాసి యట్టిజాబితా సంపూర్ణమైన పిదప మహారాజుగారి రత్న సువర్ణాభరణములు మొదల్గు గొప్ప సరకులు నిరపాయముగ నుండున ట్లేర్పాటు చేయుట, ఈ రెండు కార్యము లతఁడు మెలఁకువతో నిర్వహించెను.

అనంతర మాచార్యుఁడు మహారాజుగారి కోటలో జరుగుచున్న దురభ్యాసముల నివారింపఁ దొడగెను. కోట నాశ్రయించి పనిపాటలు లేక మహారాజుగారి డబ్బుతిని క్రొవ్వి స్తోత్రపాఠములు చేసి కాలక్షేపముచేయు సోమరిపోతుల ననేకుల రంగాచార్యుఁడు తీసివేసెను. ఆకాలమున జిన్న మహారాజునకు మాలిసన్ దొర చదువు జెప్పుచుండెను. అతఁడు రంగాచార్యుని యార్జనము, మనస్థైర్యముఁ జూచి సంతసించి వానియం దిష్టముకలవాఁ డయ్యెడు.

1874 వ సంవత్సరమున రంగాచార్యుఁడు "మైసూరులో నాంగ్లేయ పరిపాలన" మనుశీర్షికతో నొక చిన్న పుస్తకమునువ్రాసి దానిని లండను పట్టణములో నచ్చు వేయించి యచిర కాలములోనే యట్టిగ్రంధము మఱొకటివ్రాసి సంస్థానములో జేయవలసిన మార్పుల నందుదహరించునట్లు వాగ్దానము చేసెను. కాని రెండవ గ్రంథ మెన్నఁడు వెలువడ లేదు. ఏలయన యాగ్రంథము వ్రాయకమునుపే యాచార్యుఁడు మైసూరు సంస్థానమున గొప్పపదవినొంది యేమార్పు లావశ్యకములని తాను రెండవ గ్రంథమునందు వ్రాయఁదలెంచనో స్వయముగాఁ జేయుటకు నితరుల చేతఁ జేయించుటకుఁ దగిన యధికారమును వహించెను. మొదటి గ్రంథము వెలువడిన తోడనే రంగాచార్యుఁ డసాధారణబుద్ధిశాలి, శక్తిమంతుడనని మొదటికమీ