పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

మహాపురుషుల జీవితములు



అ కాలమున నచ్చటి జిల్లాకలక్ట రగు బాలర్డుదొరకు రంగాచార్యుని యెడ జాల నమ్మిక కలిగెను. ఆదొరయే యవ్వల కొంతకాలమునకు తిరువాన్కూరు, కొచ్చెన్ సంస్థానములలో దొరతనమువారి పక్షమున రెసిడెంటయ్యెను.

ఈనడుమ మైసూరు సంస్థానస్థితి చాల శోచనీయముగా నుండెను. దొరతనమువారు వెనుకటి మహారాజగు కృష్ణరాజయొడయరును గద్దెమీదినుండి దింపి వాని దత్తపుత్రుడు యుక్తవయస్కుఁ డయిన పిదప రాజ్యము స్వీకరింప వచ్చునని శాసించిరి. స్వదేశ సంస్థానములతో నేకాడికైన సంధినేజేసికొని, వాటిజోలికి బోక నెమ్మదిగా దేశమును బాలింపవలయునను తలంపుగల లార్డు విలియంబెంటింకువంటి మంచిగవర్నరుజనరలు కూడ తన నియమమునకు విరుద్ధముగా జోక్యము కలిపించుగోవలసినంత దుర్దశకు మైసూరు సంస్థానము మరల నెన్నడు రాకుండజేయదలచి యేబదిలక్షల జనులకు రాజుకాదలచియున్న చిన్న మహారాజునకు నిరంతరము ప్రజాను రంజనముగా, ప్రజాక్షేమకరముగ పరిపాలనము జేయించునట్టి విద్యనుం జెప్పింప నిగ్లాండులోని దొరతనమువారు నిశ్చయించుకొనిరి. హిందూదేశ కార్యదర్శిగా రింగ్లాండునుండి పంపిన యీ యుత్తరువు అమలులోనికిఁ దెచ్చుటకు మైసూరులోఁ గొన్నిమార్పులు జరుగ వలసి వచ్చెను. అప్పుడు మైసూరులో నింగ్లీషు దొరతనమువారి పక్షమున నధికారము చేయుచున్న బౌరింగుదొర మహారాజుగారి యంతఃపురపు లెక్కలు పరీక్షించుటకు నమ్మికయుంచఁదగిన చెన్న పట్టణ మనుష్యునొకని సిఫారసు చేయుమని యెల్లిసు దొరకు వ్రాసెను. ఎల్లిసు రంగాచార్యుని బంపెను. 1868 వ సంవత్సరమున రంగాచార్యుఁడు మైసూరు కొలువులోఁ జేరెను. ఈ పనిలో జేరిన యచిరకాలముననే వానికి మఱియొక పనిగూడ యధికారు లప్పగిం