పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజా సర్ మాధవరావు

మాధవరావు 1828 వ సంవత్సరమున గావేరీ తీరమందలి కుంభకోణ పట్టణమందు జన్మించెను. ఈయన కుటుంబము మిక్కిలి గౌరవనీయమయినది. ఆయన తండ్రి రంగారావు కొంతకాలము తిరువాన్కూరు దివానుగా నుండెను. ఆయన పినతండ్రి రామరాయ వెంకట్రావుగూడ తిరువాన్కూరు సంస్థానమున మంత్రియై యుండెను. తండ్రి మాధవరావును జిన్నతనమందే చదువునిమిత్తము చెన్నపట్టణమున కంపెను. మాధవరా వప్పటి చెన్నపట్టణపు హైస్కూలులోఁ జేరి పవెలుదొరవద్ద విద్యారసముంగ్రోలెను. ఈయన సహాధ్యాయు లందరు మిక్కిలి సుప్రసిద్ధులైరి. మాధవరావు మిగుల జాగరూకతయు శ్రద్ధయుఁ గలిగి విద్యాభ్యాసము చేసెను. ఆయన గణితశాస్త్రము ప్రకృతిశాస్త్రము నేర్చుకొనుటయేఁగాక యుపాధ్యాయుఁ డగు పవెలుదొరగారి మేడమీఁది జ్యోతిశ్శాస్త్రము నభ్యసించెను. దాని నభ్యసించు నప్పుడు మాధవరావు వెదురుగొట్టముల కద్దపుబిళ్ళలదికి గ్రహసంచారమును జూచుటకై సూక్ష్మదర్శకయంత్రములుఁ జేసి గురువునకు బరమానందముఁ గలిగించుచు వచ్చెను. మాధవరావు 1846 వ సంవత్సరమందుఁ బట్టపరీక్షలోఁ గృతార్థుడై విద్యాభ్యాసము ముగించెను.

పవెలుదొర శిష్యునియం దధికాభిమానముఁ గలవాడగుటచే వానినివిడువనిష్టము లేక తనపాఠశాలలో వానికుపాధ్యాయత్వమిప్పించి వానిచేత గణితశాస్త్రము ప్రకృతిశాస్త్రముఁ జెప్పించెను. ఆ యుద్యోగమునం దతడు చిర కాలముండ లేదు. ఏలయన యల్పకాలము నందే తిరువాన్కూరు రాజకుమారున కింగ్లీషు నేర్పుట కుపాధ్యాయుఁడు కావలసివచ్చినందున మాధవరావా యుద్యోగమును బడ