పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[37]

మహారాజా సర్ రామవర్మ

289



బడయవలెనని ప్రయత్నము చేయుచుండనంతలో మృత్యువు వానిం దనవాత బెట్టుకొనియె. ఆయన 1884 వ సంవత్సర మైదవ యాగష్టున కాలధర్మము నొందెను. ఆయన యనుకొన్నట్లె పూర్వులవిధమున నేఁబదియేండ్లు నిండగానే మృతినొందెను. కర్మలయం దాయనకు సంపూర్ణ మయిన విశ్వాసము కలదు. కర్మలు చేయఁదలఁచినప్పుడు సగము సగము చేయక సంపూర్ణముగ జేయవలెనని యాయన యభిప్రాయము. ఏ దేశమునకుగాని రామవర్మవంటి మనుష్యులు ప్రభువులగుట జనుల యదృష్టమని చెప్పవలయును. అంతటి మహారాజును దీర్ఘాయురారోగ్యము లిచ్చి రక్షింపక భగవంతుఁడు నట్ట నడుమ ద్రుంచివేయుట జనుల భాగ్యదోషముననేకదా !

తిరువాన్కూరు మళయాళదేశములోఁ జేరినది. అక్కడ తండ్రియాస్తి కొడుకునకురాక మేనల్లునకుఁ జెందుచుండును. రామవర్మయు వెనుకటి రాజునకు మేనల్లుఁ డగుటచేతనే రాజ్యప్రాప్తి గలిగెను. ఇప్పటి మహారాజు రామవర్మకు మేనల్లుఁడు గావుననే గద్దె యెక్కెను. అక్కడ ధర్మశాస్త్రము మన ధర్మశాస్త్రము వంటిదికాదు.