పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


దీసి, సమీపముననున్న యొడ్డునఁ బెట్టి దానిని దహనముఁ జేయఁ జూచెనుగాని కట్టెలు లేకపోయెను, శిథిలమైయున్న యొక పడవయొక్క బల్లలను ప్రోగుచేసి వానితో నతఁ డా శరీరమును దహనముఁ జేసెను. పాంపేయుండు క్రీ. పూ. సం|| 48 రములో మృతినొందెను.