కన్యాశుల్కము : ప్రదర్శన : ప్రశంస
కన్యాశుల్కం: లుబ్ధావధాన్లు స్థితిని గురించి, గిరీశమును అగ్నిహోత్రావధాన్లు ఆడిగినట్లు చూపవలెను.
(నీవు) యెన్నాళ్ళు బ్రతికినా యేమి సామ్రాజ్యమే
కొన్నాళ్ళకో రామచిలుక అల్ల
మూనాళ్ల బతుకుల్కు మురిసేపుత్రుళ్లేవు
ముందుగతి గానవె Iచిలుక||
కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు
కన్నతల్లి ఎవరో చిలుక Iయే!
ఇల్లు ఇల్లు అనియెవు ఇల్లు నాదనేవు
నీ యిల్లు యెక్కడే చిలుకా
పూరికి పుత్తరాన సమాదిపురములో
కట్టిల్లు యున్నదే చిలుక Ilయొ||
నిన్ను మోసేరు నలుగురు ఎంబడే పదిమంది
సమాది పురమందు సాగనంపిరి |చి|
నివు కాలిపోయేదాక, కావలుండిరిగాని
కడక దొలిగొస్తారు నీయెంట యెవరా రే చి।
- మల్లయ్య (ద్రాక్షారామం) పాడగా మహాకవి వ్రాసు కున్న పాట. దీనిని సంస్కరించి కన్యాశుల్కము నాటకములో దాసరి వేషంలోవున్న శిష్యుడిచేత పాడించారు.