పుట:Kasiyatracharitr020670mbp.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము

ఆషాపురము 3 ఘంటలకు వదిలి రాత్రి 8 ఘంటలకు 6 కోసుల దూరములోనుండే హయిదరాబాదు షహరు ప్రవేశించి షహరుకు సమీపమందుండే బేగంబజార అనే పేటలో నొక తోటలోని బంగాలాలో దిగినాను. ఆ షాపురము వదలిన వెనక 2 కోసుల దూరములో షంషాబాదు అనే బస్తీ గ్రామము కోటసహితముగా నొకటి యున్నది. అదివరకు దోవసరాళము. లొగడి మజిలీ భాటవలెనే 1 గడియదూరము మిట్టయెక్కుచు గడియ దూరము పల్లములో దిగుచు దారిని నడవవలసినది. షంషాబాదు మొదలు చిన్నతిప్పలు దారికి నాలుగు పక్కలా అగుపడుచు వచ్చును. దారి కొంచెమయిన రాగిగొట్టుగలది. దగ్గిరదగ్గిర చిన్న గ్రామాలున్నవి. అనేక మశీదులు చూచుచు పోవచ్చును. చిన్న చెరువులు కొన్నియున్నవి. వాటికింద మామిడితోపులున్ను, కూరగాయల తోటలున్ను వేసియున్నవి.

ఆ దినము మొహర్రం అనే పండుగ ఆరంభ మయినది. ఆ తొమ్మిదో దినము ఆ షహరుకు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమ్మాత్ముని చైతన్యము ఆ షహరులో వెక్కువగా ప్రకాశించుట చేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆతొమ్మిదోదినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు. సకల విధములయిన యారాధనలను అంగీకరించి "యాదృశీ భావనా యత్ర సిద్ది భ్రవతీ తాదృశీ" అనే వచన ప్రకారము లోకుల యిష్టసిద్ధిని చేసే పరమాత్ముడు ఒక్కడే గనుక ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము అక్కడ ప్రతిఫలించుటచేత ఆ స్థలముఆ కాలమందు పుణ్యస్థలమని భావించి అక్కడ వట్టికాలమందు నన్ను ప్రవేశ పెట్టినందుకు నీశ్వరుని చాలా కొనియాడడ మయినది.

21 తేది రాత్రి మొదలు జూలాయి నెల 2 తేదీ సాయంకాలము వరకు హయిదరాబాదు షహరుతో చేరిన భేగంబజారులో నున్నాను. ఆ రాత్రిమొదలు జూలాయి 13 తేది రాత్రివరకు శికంద