పుట:Kasiyatracharitr020670mbp.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరమిచ్చినందున గంగ యమునతో యిక్కడ సంగమమైనది. యీ స్థలము యాగాలుచేయు నిచ్చయించిన బ్రహ్మదేవుడు మొదలుగాగల పెద్దలను ఆకర్షింపుచు వచ్చినందున ప్రయాగ అనే పేరు యీస్థలానికి కలిగి నది. యీ ప్రయాగక్షేత్రములో గంగ యమునతో సంగమమయినది మొదలుగా సాగరసంగమ పర్వంతము రెండునదుల సమిష్టి జలము ఒకపక్క యమునా సంబంధమైన నైల్యల్వర్ణము గలిగి గంగా అనే పేరుతో ప్రవహిస్తూ వున్నది.

యిట్లుండగా బ్రహ్మ అశ్వమేధాలు చేసిన వెనక యీస్థలాన్ని స్తుతి చేయను మొదలుపెట్టి సమాప్తి చేయడానకు శక్తుడుగాక పోయెను. బ్రహ్మపుత్రి అయిన సరస్వతి నేను సమాప్తిచేయ గలను గాని నీచేత వచ్చునా యని స్తుతి చేయను ఉపక్రమించి ఉపసంహారము ఛేయను శక్తురాలు కాకుండా పోయి లజ్జితు రాలయి వుండెను. యిట్లుండగా బడబుడు అనే ఒక రాక్షసుడు భూలోకమందు పుట్టి అతి క్షుత్తిచేత లోకాన్ని హింసిస్తూ వచ్చినందున త్రిమూర్తులు లోకరక్షణర్ధ మయి ఒకటిగా కూడి యోచన చేస్తున్నంతలో లజ్జితురాలయిన సరస్వతి యేసాకుచేత నయినా బ్రహ్మముఖము చూడక తప్పించుకొని పోవలెననే యిచ్చచేత నేను ఆ రాక్షసుని ఉపద్రవము జగత్తునకు లేక చేస్తున్నానని ప్రతిజ్ఞచేసి బ్రహ్మలోకము వదిలి వారి అనుజ్ఞమీద భూలోకానికి వచ్చి అతి సుందర రూపముతో వీణాగానము చేస్తూ ఆ రాక్షసుని సన్నిధానానకు వచ్చినది. ఆ రాక్షసుడు ఆమె సుందరాకృతికి మోహితుడయి క్షుద్బాధను కూడా వహించి కొంతసేపు లోకాన్ని ఉపద్రవ పెట్టని వాడయి సరస్వతిని చూచి నిన్ను వివాహము చేసుకోవలెనని మనసులో వున్నదని చెప్పినాడు. ఇంత క్షుత్తుగల నిన్నుపెండ్లి ఆడితే భోగాలకు సావకాశము వుండ నేరదే... ఒక వేళ నీవు నన్ను భక్షించి వేతువనే భయము నాకు జనింపుచున్నది గనుక క్షుత్తు నివర్తింఛే పని ముందర విచారిస్తే వెనక వివాహసంగతి మాట్లాడు కొందామని సరస్వతి చెప్పెను. సాక్షుత్తు నివృత్తి అయ్యేమార్గము నీవే విచారించ వలనని ఆ రాక్షసుడు సరస్వతిని ప్రార్ధించి నందున బడబాసురుని మంచిదని వెంట