పుట:Kasiyatracharitr020670mbp.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వులతో ప్రత్యేక ప్రత్యేకముగా కలుసుకొన్నప్పుడు ఆ యా గుణములతో తాను ప్రకోపింవుచున్నది. అది యెట్లానంటే శీతదేశస్థులకు శ్లేష్మవాయువు ప్రకోపిమయి వేదించినట్టున్ను ఉష్ణదేశస్థులకు ఉష్ణవాయువు ప్రకోపించి వేధించినట్టున్నేగాని శుద్ధవాయువు ఎక్కడా ఒక ప్రకోపాన్ని పొందడములేదని తోచుచున్నది.

ఎనిమిదవ ప్రకరణము

యీ మైహరు అనే ఊరు బొందిలీ ఖండము మధ్యేఉన్నది. దీని చుట్టూ 10 ఆమడదూరపు భూమిని బొందిలీఖండ మంటారు. యీ మైహరు రాజుపేరు 'బిష్మశింగు ' వీని తాత పర్నా దేశపు రాజు కింద సరదారుగా వుండే పర్నారాజు తమ్ముణ్ణి యుద్ధములో చంపి నందున చెయి పట్టుగా పట్టి నాకు ఒప్పగించక నాతమ్ముని చంపితివే అని షరాపెట్టి పర్నారాజు యీరాజును తలకాజ్ఞచేసి అయినా తనకు నుపకారము చేసినందున సంత్సరము 1 కి లక్ష రూపాయీలు యేత్తే యీ మయిహరు రాజ్యాన్ని యీ రాజు తండ్రికి జాగీరుగా యిచ్చినాడు. అద్యాసి ఆ ప్రకారమే అనుభవింపుచు కుంఫిణీ వారికి చాలా విహిరముగా నడుచుకొను చున్న ఈ దారిని వచ్చిన దొరలకు కావలసినట్టు సరఫరాయిచేసి సంతోషపెట్టి యీరాజు బహు యోగ్యుడని వారివద్ద క్యారకటరు పూనుకొనుచున్నాడు. భగవంతుడు నాయందున్న ఆప్రకారమే గౌరవము కలగచేసి నందున ఆరాజు సకల విధాలను నాకు ఉపచరించి వెనక నావద్దనున్ను క్యారకటరు పుచ్చుకొన్నాడు. కొన్ని సంవత్సరములు కిందట యీ బిష్మశింగు తమ్ముడు ప్రయాగదత్తు అనేవాడు అన్నతో కలహపడి జబ్బల్ పూరు యేజంటుగా రాజ్యమును పంచుకొన్నాడు. ఈబీష్మశింగు కింద యిపుడ తని సగానికి వచ్చిన 40000 రూపాయీల రాజ్యమున్ను ఉన్నది. ఇతని రాజధాని నిండా బస్తి అయినదికాదు.

ప్రయాగకు సిహోరానుంచి బలుహోరా మీదుగా ఒక దారిన్నీ మైహరునుంచి చిత్రకూటము మీదుగా ఒకదారిన్ని పోవు