పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

147

పదియవ అధ్యాయము

చేసిరి. “నన్ను వెళ్ళిపొమ్మను ఉత్తరువును దయచేసి రద్దుపరు వుడు. నాయావజ్జీవమును మీ చెరసాలలో నస్నంచుడు. ఒక చో టనుండి మరియొక చోటకు, అచటినుండి మరియొక చోటకు పారి పోజాలను. నాస్వంత ఖర్చుమీద నాస్వంత భోజనము చేసి కొనుటకు అను జనిచ్చి నన్ను యావజ్జీవమును ఖైదులోనుంచిన అచట ఆత్మశాంతి గలిగియుండెదను” అని ఈమహాపురుషుడు' వ్రాసిన యుత్తరము బెర్ని ప్రభుత్వము యొక్క హృదయమును కరిగించలేక పోయెను. అందుమీద రూసో యాప్రదేశము' విడిచి భార్యతో కూడ నెచటకో పోను ద్దేశించి తోవలో ప్యారి సులో దిగెను. అచటి ప్రజలలో గలిగిన ఉత్సాహము వర్ణనా" తీతము. ఫ్రెంచి మంత్రులును ఈయన యందు విశేష గౌరవము గలిగియుండిరి. రహస్యముగా నీయవదర్శనము చేసిరి. దేశ మంతయు నీయనను పూజించుచున్నందున ప్రభుత్వమువారు కూడ చూచి చూడనట్లూరకొనిరి. ఇరువది దినములలోనే యీయన ఆంగ్లేయుపండితుల ఆహ్వాసము మీద నొక రాత్రి వేళ బయలు దేరి ఇంగ్లాండుకు వెళ్లెను. లండనులో దిగగానే ఆంగ్లే యప్రజలుసు ఆంగ్లేయ పండితులును ఈయనకు అసమాన మగు గౌరవముజూపిరి. ఇంగ్లాండులోని కొండలప్ర దేశ మున నొక గ్రామమున ఈయన స్థాపర మేర్పఱచుకొని శాంత ముగా కాలము గడవు చుండెను. ఇంతలో ఇంగ్లాండులోని కొందఱు పండితులకును రూసో కును కలహములు కలిగెను. అయిదు నెలలలో ఇంగ్లాంకును వదలి పెట్టి తిరిగి ఫ్రాన్సును చేరెను. ప్రజలకును ప్రజానాయకులకును ఈయనయందు

,