పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
134

ఫ్రెంచి స్వాతంత్య్ర విజయము


యు తలపవచ్చును. ఎట్టి సందేహమును పొందనక్కఱలేదు. ప్రభ్వుక్షేమమున కావశ్యకమగు రెండువిషయములు స్థాపించుట." , కు అడ్డము వచ్చు బుద్ధి హీనమగు విశ్వాసములను తొలగద్రోయ వలెనని యే నేను కోరునది.. ఆరెండు విషయము లేవన - ఒకటి: అందరు పౌరులును తమలో తాము సమానులుగ నుండుట; రెండవది: మనుష్యులు తాము కష్టపడి సంపాదించిన దానిని అను భవించుట, ప్రభువులు సోమరిపోతులు,” అనివాసెను. మరి మంత్రి యగు మషాల్టు అను నాయన టాలి, అను భూమిపన్నును తీసివేసి పభువులు, మతగురువులు, సొమాన్య జనా లు మున్నగునందరును తమ తమ భూముల మీద సమానముగా చెల్లించునముల నొక శిస్తును ఏర్పాటు చేయవలెనని వ్రాసెను. ఛాయిలు సెలు అను మంత్రికూడ సంస్కరణము కావలెనని వ్రాసెను. మత పీఠములు చాల ఎక్కుడుగ నున్నదనియు వీనియ న్ని టి మీదను సరిగా పన్నులు వేసినచో ప్రభుత్వము యొక్క ఆర్థిక స్థితి బాగుపడుననియు గూడ ఈయన వ్రాసెను. పరాసు దేశములో స్వతంత్ర విప్లవమునకు కారకులగు గ్రంథకర్తలలో మిగుల ముఖ్యులు వాల్టేను, రూసో అను వారు ఇద్దరు.

వాల్టేరు 1694 వ సంవత్సరమున పారిసునగరమున జన్మించెను. ఆయన తండ్రి యొక న్యాయాధిపతిగ నుండెను. పదునాలుగవ లూయి రాజు ప్రొటెస్టెటులను

వాల్టేరు,

బాధించుటను గూర్చి వాల్టేరు ఆక్షేపించెను. ప్రహసనములు వ్రాయుటలో వాల్టేరు అసమానపు ప్రగ్న గల ఎటులను