పుట:Dvipada-Bagavathamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

41

ధన్యమై వెలుఁగొందె తామరసాక్ష!
కులముద్దరించితి కులశైలధైర్య!
నీవ భూతంబుల నెరయఁబుట్టించి
ప్రోవనడపఁగనోపు పురుషుండ వీవ
[1]సకలంబుఁ గనుఁగొను సాక్షివి నీవ
వసుదేవునకును దేవకి కుద్భవించి
వసుధభారము మాన్చి వైరుల నడఁచి440
యక్షయ! నీచేత నసురసైన్యంబు
లక్షోహిణిశతం బణఁగిపోగలదు;
దేహబంధంబులుఁ దెలియంగ లేక
మోహాంధుఁడైన నామోహపాశములు
దెగఁగోసి నాకోర్కి తెఱవానతిమ్ము
సగుణనిర్గుణరూప! సత్యసల్లాప!"
అని వేడుకొనియెడు నక్రూరుఁ జూచి

శ్రీకృష్ణుఁడు అక్రూరుని పాండవుల సేమము నరయుటకై హస్తినాపురికిఁ బుతైంచుట


“అనఘ! పితృపివ్యుండ వాత్మబంధుఁడవు
సరసవాక్ప్రౌఢిని సౌమ్యచిత్తుఁడవు
పరమాప్తుఁడవు మాకు బంధులలోన
నీయట్టి చెలికాఁడు నీయట్టి సుకృతి
నీయట్టి సుజ్ఞాననిధి యెందుగలఁడు?
మాతండ్రి యట్లట్ల మమ్ము శిక్షించి

  1. పద్యపాద మొక్కటే కన్పడుచున్నది.