పుట:Dvipada-Bagavathamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ద్విపదభాగవతము

యీతెఱంగని చెప్పు దేకార్యమైన;”
ననిపల్కి కమలాక్షుఁ డక్రూరుఁ జూచి,
తనరార బాంధవత్వముఁదోఁపఁ బలికె.
“ఆనకదుందుభియనుజ! ధర్మాత్మ!
మేనత్త మాకు నర్మిలి తల్లికంటె
పెనిమిటి గడచన్న బిడ్డలుఁ దాను
మనపట్టు లేక యున్మలికతోఁ గొంతి450
క్రూరాత్ముఁడగు బావ కుదురునేయున్న
యారాజపుత్రులు యసమపాహసులు
తమ్మునిపాలుఁ దత్తనయుల కిచ్చి
నెమ్మదినుండగ నేరఁ డానృపతి
వారికి వీరికి వసుధకైఁ బోర
నీరసంబున మీఁద నెట్లు గాఁగలదొ?
కరివురి కేఁగి యక్కడ పాండుసుతుల
నరసి యిచ్చటి సేమమంతయుఁ జెప్పి
[1]గర్వితుఁడగు కంసుఁ గడపి తజ్జనకు
నుర్వి యేలింపుచున్నారమనుము
ధృతరాష్ట్రుచందంబుఁ దెలిసి
మతులెల్లఁ దెలిసి క్రమ్మర వేగరమ్ము
పొ మ్మందఱకుఁ గట్నములు భూషణములు
నిమ్మంచు” చెప్పించి యిచ్చి యాలోన
నుద్ధవుండును దాను నొగియింటి కరిగి
బద్ధానురాగుఁడై పద్మాక్షుఁ డుండె.

  1. దర్పితుండగు కంసకు ద్రుంచి తజ్జనకు