పుట:Dvipada-Bagavathamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ద్విపదభాగవతము

వాసుదేవుఁడు వారి వధియించె నంతఁ
గనుఁగొని మల్లవర్గమువారు వారుటయును
యనిమిషావలిఁ జూచి యచ్చెరువందె.

కంసుఁడు ముష్టికచాణూరులు మడియుటఁ జూచి తనసేనాపతులతోఁ బలుకుట


భోజభూపతి వారు పొలియుటఁ జూచి
రాజసం బెడలి బోరన నశ్రులొలుక
వడివాద్యముల మ్రోఁత వారించి తనదు
పడవాళ్ళఁ బిలిచి నిర్భయవృత్తిఁ బలికె.
“ఈపాపకర్ముల నిరువుర నీళ్ల
ద్రాపించి, వసుదేవుఁ దునుమాడి, నంద
గోపునియిల్లు ముట్టుకొని చెఱఁబెట్టి
గోపాలకులఁ బట్టికొని, యుగ్రసేను
దండించు”డని భోజధరణీశుఁ డాడు
దండిమాటల కల్గి దానవాంతకుఁడు230

శ్రీకృష్ణుఁడు కోపించి కంసునిపై లంఘించి యీడ్చి చంపుట


గిరిశృంగమునకు లంఘించు సింహంబు
కరణి దన్గదనుకలిమీఁది కెగయ,
కని భోజపతి కేల ఖడ్గ మంకించి
కొని యాజ కెదుఱంగఁ గొరనవ్వు వెలయ
నురగంబు పక్షీంద్రుఁ డొడియు చందమున
కరవాలుఁగేలు నుగ్రతశక్తిఁ బట్టి
కొసవెంట్రుకలు వట్టి గొరగొర నీడ్చి
వసుమతిఁ బడఁద్రోచి వడి మీదికుఱికి