పుట:Dvipada-Bagavathamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

205

మనములోపలమెచ్చి మగధున కనియె.550
అనఘ! యుద్ధార్థులమై వచ్చినార
మెనయఁ గృష్ణుండ నే నితఁడు వాయుజుఁడు
వాఁడు కవ్వఁడి మాకు ద్వంద్వయుద్ధంబు
పోఁడిగా నిమ్మన్న పొంగి మాగధుఁడు
“అగుఁగాక మీకోరి నట్ల యుద్ధంబుఁ
దగ నిచ్చినాఁడ యుద్ధతఁ జేర్చిరండు
“గోపాల! నీవోడి కురుకుమారకుల
వైపునఁ దెచ్చితి! పడుచుల తరమె!
పసదప్పి నీవోడి పారిన నేల
కసువు మొల్వదు నేఁడు! కాన నీతోడ
సమరంబు సేయుట సమయంబు గాదు
కమలాక్ష! నాకీడుగాఁ డర్జునుండు
మల్లయుద్ధంబున మారుతాత్మజుని
త్రుళ్లడంచెద! మీరు తొలఁగఁగ జూడుఁ”

భీమజరాసంధుల మల్లయుద్ధము


డనిపల్కి సన్నద్ధుఁడై యూరు వెడలి
చని యొక్క యెడ సమస్ధలముఁ గావించి
మారుతాత్మజుఁడును మగధభూపతియు
నీరసంబున డాసి యేపార నంత;
నంతకాకారులై యత్యుగ్ర భద్ర
దంతావళంబులు దగ్గఱు మాడ్కి560
పటుతర నిర్ఘాతపాతంబులట్ల
చటులతమై మల్ల చఱచి యొండొరులఁ