పుట:Dvipada-Bagavathamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

161

“తడయక యీకష్టతను బొంది యిందుఁ
బడనిపాటులఁబడి పద్మాయతాక్ష!
వేదాంతవేద్యులు వెదుకంగలేని
నీదివ్యచరణ సన్నిధిగంటి మంటి
పనివినియెదనో కృపారసపూర్ణ!”
అనిచెప్పి కృష్ణున కందంద మ్రొక్కి
కనకవిమాన సంకలితుఁడై నృగుఁడు
చనియె దివ్వులుకొల్వ జంభారిపురికి
అతఁడు వోయినఁ జూచి యద్భుతంబంది
శతదళనేత్రుఁ డచ్చటివారి కనియె.
“హాలాహలాభీలమగు వహ్నికంటెఁ
గ్రాలును విప్రవర్గపుకోపవహ్ని
వారల సొమ్ములెవ్వరు హరించినను,
దారుణలీల బాధలఁ బెద్దగాల50
మలమటఁబొంది కీటాదులైపుట్టి
పొలిసిపోదురు కులంబులు గూలిపోవు
నదిగాన విప్రుల యర్థమీభంగి
మదిఁ జూడవలయు నెమ్మదిఁ గోరువారు”
అనుచు పుత్రులు దాను నరిగి మురారి
తనమందిరమున సంతసలీల నుండె.

వసంతఋతువర్ణనము


అంతట సకలలోకానందమగుచుఁ
గంతుని సామ్రాజ్యఘనలక్ష్మి యనఁగ
పరమానురాగసంపన్న కారణము