పుట:Dvipada-Bagavathamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

151

యాతతజాడ్యంబు నావలింతయును
ఘనమైన యాతన గంపంబుఁ గదిసి
కనుమోడ్చి నిద్రించుగతి నుండెనంత;
అంబిక శ్రీకృష్ణునిఁ బ్రార్థించుట
అంబర కేశాంగమర్థంబుఁ గొన్న
యంబరాంబర జగదంబ యేతెంచి
కరకరిఁ బోరు శంకరశార్ఙధరుల
నిరువురకడఁజొచ్చి యేపార నిలిచి
హరిమోముఁజూచి యిట్లని నుతియించె.
“వరద! జగన్నాథ! వసుదేవపుత్ర!
దేవదేవారాధ్య! దివ్యస్వరూప!
గోవింద! మధువైరి! గోపాలవంద్య!
నీవు మేల్కని చూడ నిఖిలంబుఁ బుట్టు
నీవు నిద్రించిన నిఖిలంబు నడఁగు!
మాయచే నఖిలంబు మాయగావించు
మాయస్వరూప! చిన్మయ! హృషీకేశ!
మూఁడుమూర్తులు నీవ మొగివానిమీఁద990
పోఁడిగాఁ బెరిగెడి పొడవవు నీవ
బాణుఁడు దనకు సద్భక్తుఁడుగాన
స్థాణుడాతనికినై సమరంబు సేసె;
భక్తవత్సలుఁడగు పరమాత్మ నీకు
భక్తుఁడుగాని నీపగవాఁడు గాఁడు.
ఇతనికి నీకును నేమి భేదంబు?
హితమతిఁ దలపోయ నేకరూపంబు!