పుట:Dvipada-Bagavathamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ద్విపదభాగవతము

దాపజ్వరంబు నుద్ధతిఁ గూర్చి యేయ
నేపార నదిసేన నెరియింపఁ జొచ్చె.
ఉష్ణజ్వరమువచ్చు నురువడిఁజూచి
వైష్ణవాస్త్రముఁదొడ్గి వారిజోదరుఁడు

శీతజ్వరపీడితయై తాపజ్వరము శ్రీకృష్ణుని శరణు వేఁడుట


శీతజ్వరంబుఁ జెచ్చెర నేయుటయును
భూతకోటులు భయభ్రాంతిఁ గంపింప
తాపజ్వరంబు మేన్దప్పి కదియ్య
వాపోవుచును వచ్చి వారిజోదరుని
బదములపై వ్రాలి ప్రణుతింపదొడగె.
“యదువంశవల్లభ! అఖిలలోకేశ!
కారుణ్యమూర్తివి కంజాతనేత్ర!
వారిజోదర! భక్తవత్సల! కృష్ణ!
నెట్టున నీశక్తి నిఖిలజంతువులఁ
బుట్టింతు రక్షింతు పొలియింతు వీవ!
ప్రకృతియుఁ బురుషుఁడు పరమశాంతియును
వికృతులనానీవ విశ్వలోకేశ!”
అని సన్నుతించెడు నమ్మహాజ్వరముఁ
గనుఁగొని పలికె నాకమలనాభుండు.
“నీవేల వెఱచెదు? నీవున్న యెడల
సేవ నపథ్యంబు సేసిన వారిఁ980
గారింపుమర్థి నీకథ విన్నయట్టి
వారిఁబొందక నీవు వర్తింపుచుండు.”
శీతజ్వరంబంత శివు మేను సోఁకి