పుట:Dvipada-Bagavathamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

125

నందఱ నొల్లక యతిహీనకులుని
మందలోఁ బెఱిగిన మలినాంగు భీరు
నాచారదూరుని ననృతవర్తనుని
యే చూపుఁ జూచి నన్నేల కామించి
తాదిగర్భేశ్వరి వక్కటా! పుట్టు
బీదను! నను నీవు పెండ్లిగాఁదగునె?690
మీయన్న రుక్మిమామీఁది క్రౌర్యంబుఁ
బాయఁడు; మీతండ్రి పగవాఁడు నాకు;
నీవును నామీఁద నెయ్యంబు లేవు
కావున నీయింటి కడకు నీ వరిగి
వలనొప్పఁగన్నిచ్చ వచ్చినవారిఁ
గలసి భోగించుము కమలాస్య!” అనిన
నామాఁట తనకునమ్మై తాఁకుటయును
భామినీమణి డిల్లపడి మూర్ఛ మునిఁగె!
నుడివడి చేనున్న సురటల్ల జాఱఁ
దొడిగిన సొమ్ములు తొడుసూడి పడఁగఁ
దన్ను దానెఱుఁగక ధర వ్రాలియున్న

మూర్ఛపోయిన రుక్మిణిని శ్రీకృష్ణుఁ డోదార్చుట


యన్నాతిఁ గనుగొని యంబుజోదరుఁడు
సరభసంబున లేచి సతినల్లనెత్తి
కరముఁ గౌఁగిటఁ జేర్చి కన్నీరుఁదుడిచి
చెక్కిలి నొక్కెత్తి చికురముల్ దుఱిమి
యక్కటికముతోడ నక్కాంత కనియె.
“నవ్వులాటకు నన్న నామాట కింత