పుట:Dvipada-Bagavathamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ద్విపదభాగవతము

నివ్వెరపడి వ్రాల నీకేల యింతి?
ఎలనాగ! నీచిత్త మెఱిఁగెడి కొఱకు
పలికితిగాని నా ప్రాణంబు నీవ!700
పరమసాధ్వివి నీవు భయభక్తులందు
నెరసులేకున్ని నే (నెఱి భాగ్యశాలి)
ఇమ్ముల ననుఁబాయ కే ప్రొద్దునుండు
నమ్మహాలక్ష్మి నీవంభోజనయన!”
అని పల్కి శయ్యపై నల్లనఁజేర్చి.
యనునయంబున దేర్చి యబలకుఁ దార్చి
సరసరతిక్రీడ సంతుష్టుఁ జేసి
పరమపావనమూర్తి పంకజోదరుఁడు
కందర్పకోటి సంకాశలావణ్యుఁ
డిందిరావిభుఁడు లోకైకశరణ్యుఁ
డారసి యందఱి కన్నిరూపముల
సౌరతిక్రీడల సతతంబుఁ దేల్చె.

ప్రద్యుమ్నాదికుమారజననవృత్తాంతము


హరికి రుక్మిణికిని నగ్రనందనుఁడు
పరమానురక్తుఁడై ప్రద్యుమ్నుఁడట్టి
వీరుఁడు మొదలుగా వినుసమేష్టుఁడును
జారువేష్టుండును జారుదేహుండు
జారుతృప్తుండును జారుచంద్రుండు
జారుహస్తుండును జారువీర్యుండు
[1]జారుధీమణి విచారుండు(ను) బదురు;710

  1. ఒకే పాదమున్నది