పుట:Dvipada-Bagavathamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ద్విపదభాగవతము

రాముఁడుఁ దానును రథమెక్కి కదలి
తరలాక్షిఁ దోడ్కొని ద్వారకాపురికి
నరుదేర శతధన్వుఁ డాస్యమంతకము
నక్రూరునకు నిచ్చి యతిజవాశ్వంబు
విక్రమంబున నెక్క, హలియును దాను
పటురయంబున వానిపజ్జఁ దాఁకుటయుఁ
జటులత వాని యశ్వము జవం బెడలి
భరమోర్వకను బడి ప్రాణముల్ విడిచె.
తురగంబు కూలినఁ దోరంపు భీతి430
నాతఁడు కాల్నడ నరుగుటఁ జూచి
యాతతరయమున నరదంబు (ద్రోలి
ఘనచక్రధారచేఁ గంఠంబు నఱికి
తనువెల్ల నరసి రత్నముఁ గాన లేక
“శతధన్వు నూరకే చంపితి నకట!
ఇతడు మహామణి నెందుంచినాఁడొ?
అరసికొందము గాక" యని రథం బెక్కి
యరుదేర హలపాణి హరి కిట్టులనియె.

బలరాముఁడు మిథిలానగరమునకు వెళ్లుట;
అచ్చట దుర్యోధనుఁ డతనివద్ద గదాయుద్ధ మభ్యసించుట


“ఈ మిథిలాధీశుఁ డితఁడు నాసఖుఁడు
కామించి యారాజుఁ గాంచి వచ్చెదను
నీవు పొమ్మని” పల్కి నీలాంబరుండుఁ
వేవేగ మిథిలకు విచ్చేయ నతఁడు
యెదుఱేఁగి సీరికి నెంతయు వేడ్కఁ