పుట:Dvipada-Bagavathamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

101

దెలిసినవాఁడయ్యుఁ దెలియని యట్లు
బలభద్రుఁడును దాను బయనమై కదలి
కరిపురంబున కేఁగి గాంగేయ విదుర
కురుపుంగవులఁ గనుగొని పాండుసుతులఁ
దలఁచి దుఃఖించి బాంధవులును దాను
కలిసి వర్తింప; నక్కడ నొంటియైన

శతధన్వుఁడు సత్రాజిత్తుని వధించి మణిని హరించుట


యక్రూరకృతవర్మ లా కృష్ణుతోడ
వక్రుడౌ శతధన్వు వడిఁ జూచి పలికి
“రడరుచు సత్రాజతను వాఁడు నీకుఁ
గడఁగుచు యీనున్న కన్యయు హరికి420
నిచ్చె నాతని రత్న మే వెంట నై న
పుచ్చుకొమ్మ" నుటయుఁ బొరి నొక్క రాత్రి
తనయింట నున్న సత్రాజిత్తు నిద్ర
దనిసి యుండగ మెడఁ దఱిగి వధించె.
తరుణులందఱు నేడ్వఁ దనరి యామణిని
హరియించె శతధన్వుఁ డఱ యింతలేక
సత్యభామయుఁ దండ్రి చావున కడలి
యత్యంతశోకాన నతని కాయంబుఁ
దైలపక్వముఁ జేసి తగుచోట నునిచి
యా లేమ కరిపురి కరుదెంచె నంత.

శ్రీకృష్ణుఁడు శతధన్వునిఁ జంవుట


ఆమాట విని కృష్ణుఁ డబల నూరార్చి