పుట:Delhi-Darbaru.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కదంబులు.

295


శమును జూచుకోఱకుసహ్యాద్రులకు అనఁగా పడమటి కనుమ లకు పార్వతీ పరమేశ్వరులు విచ్చేసిరి. వారివలన నచ్చట ఒక కదంబ వృక్షు మునీడన ఒక బాలుఁడు పుట్టెనఁట. దానివలన నాసంతతికి కదంబ నామమయ్యె నందురు. ఇంకొక వాడుక ననుసరించి ఈశ్వరుఁడు త్రిపురాసురులఁ జంప పరిశ్రమ చేయు చో నతని ఫాలము నుండి స్వేదము కదంబ వృక్షు మూలము నకుఁ బారెననియు ఆ స్వేద బిందువులచే ఒక బాలుఁడు పుట్టె ననియుఁ జెప్పుకొనఁ బడుచున్నది. ఎటు లైన నేమి బాలుఁడు ఫుట్టెనని మాత్రము రెండు గాథలును నుడువు చున్నవి. ఆ సమయమున నా దేశమునకు రాజుండ లేదఁట. కావున రాజు.. 'నేర్పఱచుట కై సుస్థానేభ ముయొక్క తొండమునకుఁ బూ మాల నిచ్చి విడిచిరఁట. అది ఆమాలను గొనిపోయి అద్భుత జన్మ చరిత్రగల పై బాలుని కంఠమున నై చెననియు నతఁడే రాజ య్యేననియుఁ బరంపరగ నుడువఁబడుచున్నది, . ఈ పుక్కిటి పురాణకథ యొక్క యుద్దేశముమాత్రము స్పష్టము. కదంబులను వారు బయటినుండి వచ్చినవారుగాక ఆసీమయందె పుట్టినవా రని సూచించుట కిది కల్పింపఁబడి యుండనోపునని రైసు అభిప్రాయపడు చున్నాఁడు. కదంబ యను పేరువచ్చుట కొక వేళ ఈ వంశము వారుదమ కు దేవతయగు మాధు కేశ్వరునికిఁ బ్రియమైన పుష్పమునీను