పుట:Delhi-Darbaru.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-270

బరోడారాష్ట్రము.


యును సర్. టి. మాధవరావును పరిశ్రమచేసి రాజ్యభార నిర్వ హణ కార్యములకు వలయు జ్ఞాన మితనికి నలవడఁ జేసియుండిరి. కావున నీతఁడు భరతవర్ష మునందలి స్వదేశ సంస్థానాధీశ్వరు లంద రిలో రాష్ట్ర పరిపాలనా సామర్థ్యమునకుఁ బేరువడసి మున్నె న్నడు నీ దేశమున నే ప్రభుత్వము వారి చేతను .నుపక్రమింపఁబడని ఉత్తమ రాజకీయ సంస్కారములను దైర్యముతోఁ బ్రారంభించి పొగడ్తగనియున్నాఁడు. ఇతఁడు పలుమారు 'విదేశములకు యాత్రనడపి అచ్చటచ్చటఁగల విశేషములు జాగరూకతతో 'విమర్శించి తన యనుభనములను రాష్త్రోప యోగమునకయి వినియోగించి యున్నాడు. అనేక సందర్భముల నీతఁడిచ్చిన యుపన్యాసములు చదువఁ జదువ రుచికరంబులయి మనంబునకు " నాహ్లాద మొసంగుచున్నవి. నాని నెల్ల నిచట భాషాంతరీక రించి చదువరుల రంజింపఁ జేయ లేకుండుట కెంతయుఁ జింతిల్లవలసి యున్నది. ఒకటి రెండు బిందువులను చవిగొని రసాయనంపు మాధుర్యాదుల నెఱుంగు భంగి, యీమహా రాజు నుపన్యాస ములలోని యొకటి రెండు నాక్యములతో నీతని విశాల హృద యమునొక కొంత కనుగొననగు.

ఒక చో నీతఁడు " రాజకీయాధిక్యతని వాణిజ్య ప్రాము ఖ్యతగాని ఒక్క జాతితోనే పుట్టిన నెల్లు కాపు. అట్లే ముత భేదముల వలనను సంఘమునందలి స్థానమువలనను మన దేశ మున గలుగుచుండు వి శేషాధికారాధిక్యములు ఆయామతము