పుట:Delhi-Darbaru.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

హైదరాబాదు సంస్థానము.


మున చెల్లా చెదరై చెడిపోయిన రాజ్యాంగ విషయములు త్వరితగతి కుదురుపడనయ్యెను.


నైజముగారి సైన్యమునకయి నైజాము ఆంగ్లేయులకుఁ బ్రతిసంవత్సర మియ్యవలసిన పైకము బాకీపడియెను. రెసిడెం టుగా నుండిన జనరల్ ( ఫేజరు ఆంగ్లేయ వర్తక సంఘమువారి బొక్క సమునుండి యియ్యదొడంగి గవర్న రుజనరలుగా రి కాసం గతిం దెలుపుచు దాను భూమిని జామీనడుగ లేదని వ్రాసి ముందు మరల నీరీతి సందర్భము లే సంఘటిల్లిన నేమి సేయ వ లెనని యడిగెను. దానిపై గవర్నరు జనరలు దమబొక్క సమునుండి యిచ్చచుండవలసినదని యుఁ దగిన కాలము లో నీ యప్పులు దిర్చక పోయిన చో నైజాము గొంత భూభాగమును దమస్వాధీనము చేయు నట్లేర్పఱచ వలసిస దనియుఁ బ్రత్యుత్తర మిచ్చెను. రెసిరెంటుగారికిఁ దెలియఁ జేసిన యీసంగతులు నైజాముగారికిఁ గూడఁ దెలుపఁబడెను.

నైజామొంటరిగ బహు కాలము మరి శ్రమ చేసి చేసి కట్ట కడపట 1846 వ సంవత్సరము నవంబరు నెల 7 న తేది సురాజ్ -ఉల్-ముల్క్ ను ముఖ్యమంత్రిగా నేమించుకొనెను. ఇత నికినీ నైజామునకును సరి పడినదిగారు. రెసిడెంటున కితని పై నెక్కుడభిమానము. ఇతనిని నైజాము తీసి వేయ నుద్యుక్తు డయ్యెను. ఆవిషయమున నతనికిని ఆంగ్లేయ ప్రభుత్వము వారికిని బహుదూరము చర్చ జరిగెను. తుట్టతుదకు సురాజు