పుట:Delhi-Darbaru.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

హైదరాబాదు సంస్థానము.


వారుదలంచి యుందురు. కావున 1800 వ సంవత్సరమున నైజామునకును ఆంగ్లేయులకును మఱియొక సంధి జరిగెను. ఈ సంధి ప్రకారము నైజాముగారి రాజ్యములో నాంగ్లే యులచే నుంచఁబడిన సాహాయ్య సైన్యము(Subsidiary force) స్థిరపఱుపఁబడి సంఖ్యయందును హెచ్చు చేయఁబడెను. రెండు ప టాలములు సీపాయిలును, ఒక్క పటాలము ఆశ్విక సైన్యమును, వీనికిఁదగిన ఫిరంగులు మందుగుండులతోడను, సిబ్బందితోడను, మున్నున్న ఆరుపటాలముల సీపాయిలకును ఒక్క పటాలము ఆ శ్విక సైన్యమునకును జేర్చఁబడెను. మొ త్తముమీఁద ఆ గ్లేయ వర్తకసంఘమువారు నైజాముగారికి సాహాయ్య సైన్యముగ స్థిర పజచినది ఎనిమిదిపటాలముల సీపాయిలును(అనఁగా 8000లు తు పాకి నుపయోగించు భటులు) రెండుపటాలములు ఆశ్విక సైన్య మును(అనఁగా 1000 మంది రౌతులు) వీనికవసరమగు ఫిరంగులు, ఐరోపియనుల సిబ్బంది, లాస్కారులు, మందుగుండులు మున్నగు నవి. వీనికన్ని టికగు వ్యయమున కై నైజాము టిప్పూసుల్తాను రాజ్యము నుండి శ్రీరంగపట్న ము (1792), మైసూరు సంధులవలన గడించిన సంవత్సరమునకు 'కోటిరూపాయ లీను దేశ భాగమును ఆంగ్లేయుల కియ్య నొప్పుకొనెను. యుద్ధసమయముల నాంగ్లే యుల సాహాయ్యర్థమయి ఈ పటాలములలో రెండు దక్క దక్కినవానిని దన స్వంత సైన్యములోని ఆరు వేల కాల్బలము తోడను, తొమ్మిది వేల ఆశ్విక భటులతోడను, బంపుటకు నైజా