పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

చాటుపద్యరత్నాకరము

వాడుక కలదు. అదియుం గాక యీకవి యుదారస్వభావమును గలవాఁడు.

చిఠాపురాగ్రహారములోనే బొగ్గవరపు పెదపాపరాజనునొకకవి కలఁడు. ఈకవు లిరువురును స్నేహితులు. ఒకకాలమునకు లేమి సంఘటింపఁ గుటుంబరక్షణము సేయనోపక పాపరాజకవి నైజామునకు వెళ్ళి, తనస్నేహితుఁడగు తాతాచార్యకవి కీక్రిందిరీతిగా జాబు వ్రాసెను.

చ. తిరుమలబుక్కపట్టణసుధీవర! యోచినతాతయార్య! నే
   నరుదుగ జ్యేష్ఠశుద్ధవిదియారవివాసరమందు లేచి మీ
   కరుణ హుసేనుసాగరము గాంచితి తన్నిహితత్రయోదశిన్
   నిరతముఁ జిన్నవాండ్రయెడ నీదయ యుంచవయా దయామయా!

తన కీరీతిఁ బద్యము వ్రాసినంతమాత్రముననే తాతాచార్యులు మనస్సు కఱిగి పాపరాజు తిరిగివచ్చుదాఁక నాతనికుటుంబమును దానే పోషించెను.

ఈవిద్వత్కవి విశ్వగుణాదర్శమును దెలిగించి, వడ్లమన్నాటివెంకటచలంపంతులు (డిప్యూటికలెక్టరు) గారికిఁ గృతి యిచ్చెను. వారిదర్శనమునకు వెళ్ళినప్పుడు కవి రచించిన పద్యము.

సీ. వరవడ్లమల్నాటివంశాబ్ధి జన్మించి
            రాకాసుధాకరు రహి వహించి