పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

35

లక్ష్మణకవి తనప్రయోగమును సమర్థించి యు ట్లుపన్యసింపఁదొడఁగెను.

“పండితులారా! ఈశు=శివుని, నకము=బాణము, కృష్ణమూర్తి యని నేను నుతింపఁగా ‘నంతటిస్తోత్రమునకు నేను దగ’ నని మనకవివతంసుఁడు శునకసామ్యమున కంగీకరించుచున్నాఁడు. ఇట్టిపండితునిముందు మఱియొకఁడు పండితుఁ డనరాదఁట” అని హేళన చేసెను. లక్ష్మణకవి యుక్తికిఁ బండితులందఱును సంతోషించిరి. కృష్ణకవి వెలవెలఁబోయెను.

పేరిశాస్త్రిగారికిని లక్ష్మణకవికిని వివాదము తటస్థింపఁగా, లక్ష్మణకవికిఁ గవిత్వమేగాని శాస్త్రము తెలియదని శాస్త్రి యాక్షేపించెనఁట! అది విని లక్ష్మణకవి యీక్రిందిపద్యమును రచించి పంపెను.

గీ. ఉక్కుఁ జెద తిన్న దశదిక్కు లొక్కటైనఁ
   జుక్క లిలఁ బడ్డఁ గులగిరుల్ వ్రక్క లైన
   మొక్కపాటింట నోటను ముక్కలేదు
   పేరిశాస్త్రికిఁ గలిగెరా పెదవిపాటు.

ఇటులనే కూరపాటి వేంకటశాస్త్రి యను నొకకవి లక్ష్మణకవిని దిరస్కరింపఁగా నితఁడు వ్రాసినపద్యము.

ఆ. కూరపాటివెంక కుక్కలు దినుకంక
   లేనిపోనిశంక మాను మింక
   ముఖముఁ జూడఁ గుంకముండ వనెడుశంక