పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

చాటుపద్యరత్నాకరము

   నాకుఁ దోచెఁ జంక నాకు మింక.

ఈలక్ష్మణకవికి మంగన్నయను నొకమేనల్లుఁ డుండెను. అతనికి దాయాదులతో వ్యాజ్యము సంభవింపఁగా శంకరమంచి అనంతపంతులను న్యాయాధికారి లంచము గైకొని మంగన్న నన్యాయముఁ జేసెను. లక్ష్మణకవి పద్యరూపములగా నీసంగతినంతను వెల్లడిచేసెను. ఆపద్యము లివి—

సీ. మహనీయశంకరమంచిగోత్రమునఁ బ్ర
            పాతకుం డన ధరిత్రీతలమునఁ
   బండితుండువలెఁ గల్పడుదు స్థాణుత్వ మే
            ర్పడ నొకసాధులపలుకు వినవు
   పుక్కిట విషమె యెప్పుడు నీకు నుండును
            మది వీడ వెపుఁడు దామసగుణంబు
   భీముఁ డుగ్రుఁఢు ననుపేరు గాంచి నశింతు
            వంబికాపతివి బ్రహ్మఘ్నుఁడవు న
   నంతనాముండ వరయంగ నష్టమూర్తి
   వగుచుఁ బితృవనమందు భస్మాంగుఁ డవయి
   భూతములును బిశాచముల్ ప్రోదిగూడు
   కొనఁగ నుండుదు వండ్రు నిన్ జనములెల్ల.

మ. సరవిన్ శంకరమంచిపండితుఁ డనన్ జానొప్పుఁవా డర్థసౌ
   ఖ్యరుచిన్ జెందియుఁ జింతలూరిమంగామాత్యసాధ్వాత్మమం
   దిరసుక్షేత్రములన్ హరించి కపటాన్వీతుండు నౌ వాది క
   ల్లరికాఁ డంచును దీర్పు చేసి జనముల్ నవ్వం బడున్ దుర్గతిన్.

ఉ. దక్షిణదిక్కునుండియ యుదంతము దెచ్చిన ధర్మరాజు ప్ర
   త్యక్ష మనంతపాతకున కిచ్చెడు మార్గము వోవునట్టుగా