పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శా. క్షీరాంభోనిధియందు యోగసరణిం జిచ్ఛక్తిఁ బ్రాపించి త
   ద్గోరాజత్కకుబస్థ గోపవిలసద్గోరాజగోలోకతా
   స్ఫారాలోకనతేజగాత్రచలనస్వాంతాద్రిదంభోళి కృ
   త్సారజ్ఞానసనందనాదిమునిబృందాధిక్య సామర్థ్యవాః
   పూరాకారత నిద్రఁ జెందు కరుణాంభోరాశి నిన్ బ్రోవుతన్.

ఒకనాఁడు కృష్ణరాయఁడు భద్రగజంబు నెక్కి వాహ్యాళి వెడలిపోవుచుండఁగా మార్గమధ్యమునఁ బెద్దన యెదురయ్యెను. అప్పు డారాజుగారు తనమదకరీంద్రమును నిల్పి, కవీంద్రునిఁ దనసరసన కూర్చుండఁబెట్టుకొని “యేమి విశేషము” అని యడుగఁగాఁ బెద్దనగా రిట్లనిరి.

మ. గవనుల్ బల్లిదమయ్యె డిల్లికిని, మక్కాకోట మేటయ్యె,
   భువనం బెల్ల నదల్చి పుచ్చెననఁగాఁ బోలేరు సందేరులన్
   రవసం బెక్కె, బెడందకోటపురకాంతాగర్భనిర్భేదన
   శ్రవణంబయ్యె భవత్ప్రతాపజయవార్తన్ కృష్ణరాయాధిపా!

ఇక్కవీంద్రునిగుఱించి వేఱొకకవి వ్రాసిన పద్యము

సీ. కృష్ణరాయనపేరఁ గృతిని నీవొనరించి
            తివి తొల్లి విష్ణుచిత్తీయ మనఁగ
   కాఠిన్యమర్థంబు గ్రాహ్యంబు గాదు సా
            ధారణుల కని భూధవుఁడు పలుకఁ
   దరువాత మనుచరిత్రము రచియించి తు
            త్తమకావ్యము మహాద్భుతముగఁ బిదపఁ
   బెక్కుకావ్యంబులు పెంపెక్క రచియించి
            నుంటివి రాజసమ్మానమునను