[10]
కమును వీడి శుద్ధుఁడై సీతాముఖముతోఁ బోలు నని యుండఁగాఁ దెనుఁగునందు శుద్ధుఁడయ్యును సీతాముఖమునకు దాస్యోన్నతినే పొందునని మిక్కిలిసారస్యము గలిగి యున్నది.
'సచివా స్తైలద్రోణ్యాం నిక్షిప్య' యన్నముక్కను
గీ. | అర్హమయ్యెఁ గృతాధ్వరుం డయినయతని | |
అని తెలిఁగించి శ్లిష్టార్థాంతరన్యాసానుప్రాసములతో మిక్కిలి చమత్కరించినాడు.
ఇట్లె మూలమున 'అస్తి ప్రశస్తా జనలోచనానా, మానన్దసన్ధాయిషు కోసలేషు । ఆజ్ఞాసముత్సారితదానవానాం, రాజ్ఞా మయోధ్యేతిపురీ రఘాణామ్' అనుశ్లోకమునకుఁ జాతుర్వర్ణ్యాదివర్ణనకలిత మగు నొకసీసపద్యమును, విశ్వామిత్రయాగసందర్భమున 'కరతలగలితపలాశసమిత్కుశాః కుశికసుతాన్తేవాసినః' అనుటకు 2-వ యాశ్వాసమున (84, 85, 86, 87) నాలుగు పద్యములును, హనుమదాదులప్రాయోపవేశఘట్టమున 'తాస్తాఃకథాఃపరిదేవయన్త' మ్మనుటకు నయిదాఱుపద్యములను రచించి మూలముకంటెఁ దెనుఁగును రసోద్వేలము గావించినాఁడు.
కూర్పు:—ఇందు మూలములో లేనివై కేవలకవికల్పితము లగువానిని వ్రాసెదము.
వసంతవర్ణనము
సీ. | జిగితీవపడఁతికిఁ జెంగావిపావడ యవనీపదోచితయావకంబు | |
మ. | మరునందు మఱుసృష్టి మ్రాఁకులయెడం బాలించుటెక్కున్ హిమో | |