పుట:Chanpuramayanam018866mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[10]

కమును వీడి శుద్ధుఁడై సీతాముఖముతోఁ బోలు నని యుండఁగాఁ దెనుఁగునందు శుద్ధుఁడయ్యును సీతాముఖమునకు దాస్యోన్నతినే పొందునని మిక్కిలిసారస్యము గలిగి యున్నది.

'సచివా స్తైలద్రోణ్యాం నిక్షిప్య' యన్నముక్కను

గీ.

అర్హమయ్యెఁ గృతాధ్వరుం డయినయతని
దేహము తిలోత్తమోదితస్నేహమునకు
నర్హముగదా కృతాధ్వరుం డైనయతని
దేహము తిలోత్తమోదితస్నేహమునకు.

అని తెలిఁగించి శ్లిష్టార్థాంతరన్యాసానుప్రాసములతో మిక్కిలి చమత్కరించినాడు.

ఇట్లె మూలమున 'అస్తి ప్రశస్తా జనలోచనానా, మానన్దసన్ధాయిషు కోసలేషు । ఆజ్ఞాసముత్సారితదానవానాం, రాజ్ఞా మయోధ్యేతిపురీ రఘాణామ్' అనుశ్లోకమునకుఁ జాతుర్వర్ణ్యాదివర్ణనకలిత మగు నొకసీసపద్యమును, విశ్వామిత్రయాగసందర్భమున 'కరతలగలితపలాశసమిత్కుశాః కుశికసుతాన్తేవాసినః' అనుటకు 2-వ యాశ్వాసమున (84, 85, 86, 87) నాలుగు పద్యములును, హనుమదాదులప్రాయోపవేశఘట్టమున 'తాస్తాఃకథాఃపరిదేవయన్త' మ్మనుటకు నయిదాఱుపద్యములను రచించి మూలముకంటెఁ దెనుఁగును రసోద్వేలము గావించినాఁడు.

కూర్పు:—ఇందు మూలములో లేనివై కేవలకవికల్పితము లగువానిని వ్రాసెదము.

వసంతవర్ణనము

సీ.

జిగితీవపడఁతికిఁ జెంగావిపావడ యవనీపదోచితయావకంబు
మాధవశ్రీకి నిమంత్రసిందూరంబు కలికానికాయతారలకు సంజ
పరభృతవాఙ్మయప్రదశాంభవీరుచివనికాపురంధ్రికాననహరిద్ర
వనదేవతచనుంగవకుఁ గుంకుమముడంబు ధారణీరుహశైలగైరికంబు
కామినీకాముకవినోదకలనకొఱకు, సమయవర్ధకి పొదరింటిగమికిఁ గీలు
కొలిపి నరుటంపుఁగెంపుఱాతళుకుటోడు, బిల్లగుము రెల్లకడ నుద్భవిల్లెఁ జిగురు.


మ.

మరునందు మఱుసృష్టి మ్రాఁకులయెడం బాలించుటెక్కున్ హిమో
పరిసంహారముఁ జూపి తత్త్రిపురుషీభాగౌచితిం జైత్రుఁ డొం
దురజస్సత్త్వతమోగుణోన్నతు లనం దోఁచెం జిగుళ్లుం జిగు
ళ్లరకంబయ్యెడుక్రొవ్విరుల్ విరులపట్లన్ వ్రాలుభృంగంబులున్.