పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనం మోక్షానికి ఎక్కిపోతాం. ఆమెద్వారా క్రీస్తు దగ్గరకు వెత్తాం, అనగా మరియు తన వరప్రసాదాలద్వారా మనలను క్రీస్తు చెంతకు చేరుస్తుంది,

వేరుకొందరు ఆ తల్లి చంద్రబింబంలాంటి దన్నారు. చందమామ సూర్యుని వద్దనుండి వెలుగును పొందుతుంది. తాను వెలుగుతుంది, ఆ వెలుగునే వెన్నెలరూపంలో భూమికి అందిస్తుంది. అలాగే మరియకూడ క్రీస్తు దగ్గరనుండి వరప్రసాదం పొందుతుంది. తాను ధన్యురాలౌతుంది. ఆ వరప్రసాదాన్ని మనకూ అందించి మనలనుకూడ ధన్యులను చేస్తుంది. కనుక సూర్యునికీ భూమికీ మధ్య చంద్రబింబం ఎలాగో, క్రీస్తుకు నరులకూ మధ్య మరియు అలాగు. మరియ యెప్పుడూ క్రీస్తుతో పోటీపడదు. తాను ఆ ప్రభుకార్యాన్ని కొనసాగిస్తుంది, అంతే కనుక క్రీస్తు ఉన్న కాడ మరియ ఉండక తప్పకదు. మరియపట్ల భక్తి చూపడానికి ఇష్టపడనివాళ్ళు ఆమె స్థానాన్ని అర్థం చేసికొనే ప్రయత్నం చేయడంలేదనే చెప్పాలి.

పూర్వవేదప పుణ్యస్త్రీలను చాలమందినిగూడ మరియకు ఉపమానంగా చెప్పారు. ప్రస్తుతానికి ఒక్క ఉపమానాన్ని చూద్దాం. పర్షియారాజు యిస్రాయేలు ప్రజలను నాశం చేయబోతుండగా ఎస్తేరురాణి ఆ ప్రభువును మనవిచేసి తన జనులను కాపాడింది. అలాగే మరియకూడ మోక్షంలో ప్రభుసన్నిధిలో మనకోసం మనవిచేస్తుంది. ఆ ప్రభుకోపం తొలగిస్తూంటుంది.

ఫలితార్థమేటంటే అన్ని వరప్రసాదాలు పితనుండి క్రీస్తుకూ, క్రీస్తునుండి మరియకూ, మరియనుండి విశ్వాసులకూ సంక్రమిస్తాయి. దేవుడు మరియను ఈలా వరప్రసాద ప్రదాయిని చేయడం అవసరమైగాదు. ఔచిత్యం కోసం. ఇది, దేవుడేర్పచిన నిర్ణయం. ఈ నిర్ణయానికి తిరుగులేదు.

3. భక్తి భావాలు

తూర్పుదేశపు జ్ఞానులు ప్రయాణమైవచ్చి తల్లి మరియను ఆమెతోవున్న బిడ్డను చూచారు - మత్త 1,11. సువిశేషం చెప్పదుగాని, ఆ తల్లి క్రీస్తుబిడ్డను వాళ్లకు అందించి వుంటుంది. జ్ఞానులు ఆ శిశువును మద్దిడుకొని ఆరాధించి, వుంటారు. అప్పటినుండి శ్రీసభలో ఆమెస్థానం, క్రీస్తును క్రైస్తవ ప్రజలకు అందిస్తూండడమే. మన తరఫున మనం, ఆ జ్ఞానుల్లాగే, మరియద్వారాగాని క్రీస్తును చేరలేం.

అడగందే అమ్మైనా పెట్టదు. మనం బిడ్డల్లాగ ఆ తల్లి చెంతకు గబగబ పరుగెత్తాలి. మన అవసరాలను ఆ తల్లికి విన్నవించుకొని ఆమె సహాయం అడుగుకోవాలి. మన అయోగ్యతను తలంచుకొని భయపడకూడదు. బిడ్డల దౌర్భాగ్యం ఎంత గొప్పదో ఆంత జాలితో తల్లి వాళ్ళను ఆదరిస్తుంది గదా?

26