పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. ఈసాకు బలి - ఆది 22,1-19

1. సందర్భం

అబ్రాహాము సారా ముసలివాళ్ళయ్యాక ఈసాకు పట్టాడు. అప్పుడు అబ్రాహాముకి నూరేండ్ల వయస్సు తల్లిదండ్రులు ఈసాకుని అల్లారుముద్దుగా పెంచారు. ఆ బాలుడు పాలు త్రాగడం మానినరోజున అబ్రాహాము గొప్ప విందు చేయించాడు. ఈసాకుకి ముందే అబ్రాహాముకి హాగారు వలన యిష్మాయేలు కలిగాడు. కాని సారా ప్రేరణంవలన, దేవుని అనుమతిపై, అబ్రాహాము ఈ తల్లీబిడ్డలను ఇంటినుండి వెళ్ళగొట్టాడు. ఇక ఇంటిలో మిగిలివున్న బిడ్డడు ఈసాకు వొక్కడే కనుక అబ్రాహాము ఆదరణ ఆప్యాయత ప్రేమ ఆ బిడ్డడిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఈ దశలో దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు. అనగా దేవుడు అబ్రాహాముకి తనమీద యొక్కువ ప్రేమో లేక ఈసాకుమీద యొక్కువ ప్రేమో తెలిసికోగోరాడు. అబ్రహాము తన కొరకే తన్ను సేవిస్తున్నాడో లేక తన వరాల కొరకు తన్ను సేవిస్తున్నాడో తెలిసికోగోరాడు. ప్రభువు ఆ భక్తుని విశ్వాసాన్ని పరీక్షించాడు.

2. వివరణం

అతడు రాత్రి కలలో అబ్రాహాముతో మాట్లాడాడు. నీవు గాఢంగా ప్రేమించే యేకైక కుమారుని మోరీయా కొండమీద నాకు దహనబలిగా అర్పించాలని చెప్పాడు. ఈ ప్రదేశం తర్వాత యెరూషలేం నగరమౌతుంది. ఈసాకుని బలిగా అర్పింపబోయే తావననే షుమారు 900 ఏండ్ల తర్వాత సొలోమోను రాజు దేవాలయం కడతాడు. ప్రస్తుతం ఇదంతా దట్టమైన అరణ్యం. ఆ రోజుల్లో ఆ దేశంలో వసించే ఆదిమజాతి ప్రజలైన కనానీయులు తమ పిల్లలను మోలెకు దేవతకు దహనబలిగా అర్పించేవాళ్ళ అబ్రాహాముకి ఈ సంగతి తెలుసు. కాని దేవుడు తన కుమారునే యిలాగ బలియిూయమని అడుగుతాడని కలలోగూడ ఊహించలేదు. కనుక దేవుని ఆజ్ఞను వినగానే అబ్రాహాముకి పిడుగు పడినట్లయింది. ప్రభువు యిష్మాయేలుని బలిగా ఈయమంటే అబ్రాహాముకి అంత బాధ కలిగేది కాదు. కాని దేవుడు ఈసాకునే బలిగా కోరుకుతున్నాడు. ఈ ఈసాకు ద్వారానే తన సంతానం తామరతంపరగా పెరుగుతుందని దేవుడు అతడికి పూర్వమే ప్రమాణం చేసాడు. మరి యిప్పడు ఆ బిడ్డడు పోతే ఆ వాగ్గానం ఏలా నెరవేరుతుంది?

అబ్రాహాము ప్రాచీన తరానికి చెందినవాడు. అప్పడు జనసంఖ్య లేదు. కనుక ఆ కాలంలో భగవంతుడు అన్ని దేశాల్లోను అన్ని జాతుల్లోను తల్లిదండ్రులకు సంతానంమీద కోరిక పట్టించాడు. ఇప్పుడు మనం జనసంఖ్య విస్తారంగా పెరిగిపోయిన రోజుల్లో వున్నాం. కనుక ఈ కాలంలో దేవుడు తల్లిదండ్రులకు సంతానం వద్దనే కోరికను పుట్టిస్తున్నాడు.