పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్ధనా భావాలు

1 రెండవ శతాబ్దానికి විධිරධිර క్రైస్తవ రచయిత యొకడు "డయొగ్నీటస్ లేఖ” ಆనే పేరుతో ఓ రచనచేసాడు. దానిలో అతడు ఈలా చెప్పాడు "దేహంలో ఆత్మ యేలూగో ఈ లోక్షంలో క్రైస్తవుడు ఆలాగు. ఆత్మ దేహంలో వసిస్తుంది. కాని దేహానికి చెందిందికాదు. అలాగే క్రైస్తవుడు ఈలోకంలో వసించినా ఈ లోకానికి చెందినవాడు కాదు. అతడు భూలోకంలో వసించినా పరలోక పౌరుడుగా జీవిస్తాడు. ఔను, వరప్రసాదంవల్లనే మనం పరలోక పౌరులంగా జీవింపగల్లుతున్నాం. ఈ భాగ్యానికిగాను మనం ఎంతో సంతోషించాలి.
2 నాల్గవ శతాబ్దానికి చెందిన నీస్సా గ్రెగోరీ భక్తుడు ఈలా చెప్పాడు. ‘నరుడు బూడిదలాంటివాడు, గడ్డిలాంటివాడు. ఐనా అతడు దేవుడంతటివాడౌతాడు. మృత్యువువాతబడేవాడు అమరుడౌతాడు. క్షణమాత్రుడైనవాడు శాశ్వతుడౌతాడు. నరమాత్రుడైనవాడు దేవుడౌతాడు. దేవుని పుత్రుడై దేవుని ఆస్తికి వారసుడౌతాడు. ఇది వరప్రసాద మహిమ". ఈ వరప్రసాద భాగ్యానికి పాత్రులమైన మనం దాన్ని ఎంతో విలువతో జూడాలి.
3 పదవ శతాబ్దానికి చెందిన ఆన్సెల్మ్ భక్తుడు ఈలా వ్రాసాడు. "ఓ ప్రభూ! నీవు నన్ను నీకు పోలికగా చేసావు. ఎందుకు? నేను నిన్ను జ్ఞాపకముంచుకోడానికి, నిన్ను తెలుసు కోడానికి నిన్ను ప్రేమించడానికి, ఈ దొడ్డ భాగ్యాలకుగాను నేను నీకు నమస్కారం చెపున్నాను". మనలోని దేవునిపోలిక వలన మనం సహజంగానే ఆ ప్రభువుని అభిలషిస్తుంటాం. సృష్టివస్తు వ్యామోహంవల్ల కొంతకాలంపాటు ఆ ప్రభువుని విస్మరించినా మళ్ళా అతన్ని జ్ఞప్తికి తెచ్చుకొంటూంటాం.

5. దివ్యవ్యక్తులతో బాంధవ్యాలు


పూర్వాధ్యాయంలో దివ్యవ్యక్తులు ముగ్గురూ మన హృదయంలో వసిస్తుంటారనిచెప్పాం. ఈ ముగ్గురు వ్యక్తులతో మనకు మూడు బాంధవ్యాలు ఏర్పడతాయి. వాళ్లు ముగ్గురూ మూడు ముద్రల్లాంటివాళ్లు, ఎవరి రూపురేఖలను వాళ్లే మన హృదయాలపై చిత్రించుకుంటారు. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. పిత జీవనదాత


క్రీస్తు ద్వారా పిత మనలను తన పుత్రులను చేసికొంటాడని చెప్పాం. పుత్రుడు తండ్రి జీవితంలో పాలుపొందుతాడు. ఆ పత్రుని ద్వారా మనంకూడ తండ్రి జీవితంలో పాలుపొందుతాం.