పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివ్యవ్యక్తులు ముగ్గురిలో ఆంతరంగిక జీవితమూ వుంటుంది. బాహిర జీవితమూ వుంటుంది. ఆంతరంగిక జీవితమంటే దివ్యవ్యక్తులు తమయందు మాత్రమే జీవించడం. బాహిర జీవితమంటే ఆ దివ్యవ్యక్తులకు ప్రపంచ ప్రాణులతో వుండే సంబంధం. పిత సుత పరిశుద్ధాత్మల బాహిర జీవితం వాళ్ల అంతర్జీవితాన్ని అనుసరించి వుంటుంది. వాళ్లల్లో రెండు జీవితాలు లేవు. ఒకే జీవితం. కాని మనం మాత్రం దైవవ్యక్తుల జీవితాన్ని అర్థం చేసికోవాలి అంటే దాన్ని బాహిరం ఆంతరంగికం అనే రెండు దృక్కోణాలనుండి పర్యవేక్షించాలి.

ఆంతరంగికమైన దైవ జీవితంలో వార్త లేక సుతుడు పిత నుండి ఉద్భవిస్తాడు. పిత ఒకే పుట్టువు నిస్తాడు. ఈ యొకే పుట్టువు ఆంతరంగికమైన దైవ జీవితంలో, వార్త బాహిరమైన దైవజీవితంలో, సృష్టిప్రాణులు. అనగా మనమూ వార్తా కూడ ఒకే పుట్టువున ఋట్టిన కవలలం, ఆ వార్త దేవని తొలి పుత్రుడైన సుతుడు. మనం మలిపుత్రులమైన ప్రాణులం. ఈ విధంగా అందరి పుట్టువునకు కారకుడుగాన పిత జీవనదాత కావున పితతో మన బాంధవ్యం ఎలా వుంటుందంటే, అతడు మనకు జీవమిచ్చేవాడు. మనం అతని నుండి యుద్భవించిన బిడ్డలం.

 

2. క్రీస్తు సత్యదాత


క్రీస్తు మనకు దైవసత్యాలు తెలియజేస్తాడు. దైవసత్యాలంటే దేవుడేలాంటివాడు, అతడేలా పని చేస్తాడు మొదలైన అంశాలు.

క్రీస్తు మానుష రూపం గైకొనిన దైవవార్త దేవుని యాంతరంగిక జీవితంలో ఈ వార్త పిత బుద్ధిశక్తి నుండి జన్మిస్తుంది. వార్త పిత తలప, ఆలోచన, భావము, ఎరుక, పలుకు, పిత తలపులు భావాలు సుతుని యందు కరుడు గట్టుకుంటాయి. పిత సుతుని పూర్తిగా నెరుగుతాడు. సుతుడును పితను పూర్తిగా నెరుగుతాడు. కావున నరావతార మెత్తిన సుతుడు పితను గూర్చి నరులకు తెలియజేస్తాడు. కనుకనే యోహాను " ఏనాడూ ఏ నరుడూ దేవునిచూచి యెరుగడు. ఆ దేవుని ప్రియ కుమారుడే అతనిని మన కెరుక పరచాడు" అంటాడు -1 -18. ఈలా క్రీస్తు పితనుగూర్చి తెలియజేయడమే దివ్యావిష్కరణం. క్రీస్తు వచ్చింది సిలువపై మరణించి పాప పరిహారం చేయడం కోసం మాత్రమే కాదు. పితను తెలియజేయడం కోసం గూడ.

క్రీస్తు పితనూ పితను గూర్చిన దివ్యసత్యాలను తెలియజేసేవాడు. కావననే అతడు సత్యదాత. పిత మనకు అస్తిత్వము నిచ్చినవాడు గావున మన యునికి యంతటితోను సంబంధించినవాడు. కాని క్రీస్తు విశేషంగా మన బుద్ధిశక్తితో సబంధించినవాడు. సత్యాన్ని గ్రహించేది బుద్ధికదా!