పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు మనయందు మనం క్రీస్తునందు వసిస్తాం అన్నాం, అలాగే మనం పితయందు, పిత మనయందు వసిస్తాడు. క్రీస్తుని దేవుని కుమారుడని అంగీకరించిన వాళ్ళల్లో దేవుడు వసిస్తాడు. వాళ్ళూ దేవునియందు వసిస్తారు. 1యోహా 4,15. దేవుడు ప్రేమమయుడు. కావున ప్రేమ జీవితం జీవించే వాళ్లల్లో దేవుడూ జీవిస్తాడు. వాళ్ళూ దేవునియందు జీవిస్తారు - 4,16.
క్రీస్తు అంతర్నివాసం ద్వారా అతని భాగ్యాలు మనకు లభిస్తాయి అన్నాం. అలాగే పిత అంతర్నివాసం ద్వారా అతని భాగ్యాలూ పొందుతాం. పితనుండి పొందే భాగ్యాల్లో అతని "ఆకర్షణం" అనే భాగ్యం చాల గొప్పది. పిత మనలను సుతునివైపు ఆకర్షిస్తుంటాడు - యోహా 6,44. ఎందుకు? పిత తాను జీవనమూర్తి, తన జీవాన్నే సుతునకు ప్రసాదిస్తుంటాడు. ఈ సుతుని జీవాన్నే మనమూ పొందాలని పితకోరిక. కనుకనే మనలను తన కుమారుని వైపు ఆకర్షిస్తుంటాడు - 3,16. మనంకూడ ఆ పితతోను, సుతునితోను సహవాసం చేయాలి - 1యోహా 1,4.

3. పరిశుద్దాత్మ అంతర్నివాసం


ఉత్తానం కాకముందే క్రీస్తు ఆత్మను పంపిస్తానని శిష్యులకు హామీ యిచ్చాడు. ఎల్లప్పడూ వాళ్లవద్ద వుండడానికై మరో ఆదరణకర్తను పంపిస్తానన్నాడు - యోహా 14,16. ఈయాత్మక్రీస్తుబోధించిన సంగతులన్నిటినీ వాళ్ళకు జ్ఞప్తికి తెస్తుంది - 14,26. యోహాను "క్రీస్తునుండి మనం స్వీకరించిన అభిషేకం మనలో నిల్చివుంటుంది" అంటాడు -1 యోహా 2,27. ఏమిటీ యభిషేకం? జ్ఞానస్నానం ద్వారా మనం పొందిన పరిశుద్దాత్మే ఈ యాత్మ క్రీస్తు బోధించిన సత్యాలన్నీ విశ్వాసులకు బోధిస్తుంది. తాను విశ్వాసుల్లో వసిస్తుంది.
పౌలు తన జాబుల్లో "క్రీస్తునందు” “ఆత్మయందు" అనే ప్రయోగాలు రెండూ చాలసార్లు వాడుతుంటాడు. తొలి ప్రయోగానికి మనం క్రీస్తునందు, క్రీస్తు మన యందు వసిస్తుంటామని భావం. రెండవ ప్రయోగానికి మనం ఆత్మయందు, ఆత్మ మన యందూ వసిస్తుంటుందని భావం.
కొరింతు పౌరులకు వ్రాస్తు పౌలు వాళ్ళ దేవాలయం వంటి వాళ్ళనీ ఆత్మ వాళ్ళల్లో వసిస్తుందనీ బోధించాడు- 1కొ 3, 16 ఈ వాక్యంలో విశ్వాసులు సాముదాయికంగా పేర్కొనబడ్డారు. అనగా కొరింతులోని క్రైస్తవ సమాజంలో ఆత్మ వసిస్తుంది. ఇదే జాబు 6,19లో వ్యక్తిగతమైన అంతర్నివాసం చెప్పబడింది. పూర్వవేద ప్రభువు *పెక్రీనా? అనే పేరుతో యూదుల దేవాలయంలో వసించేవాడు. నూతవేదంలో విశ్వాసుల హృదయాలే దేవాలయాలు. ఈ దేవాలయాల్లో దేవుని ఆత్మ వసిస్తుంది.
273