పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలైన ఆయుధాలతో యుద్ధానికిరాగా దావీదు దేవుడైన యావేపేరిట వచ్చాడు. ఇక్కడ దైవబలమూ మనుష్యబలమూ ఒకదానితో వొకటి-పోరాడాయి. చివరికి దైవబలమే నెగ్గింది. జీవితంలో దైవబలంమీదనే ఆధారపడేవాళ్లు కొందరూ, కేవలం మనుష్య బలంమీదనే ఆధారపడేవాళ్లు కొందరూ - 1సమూ 17,45-51.

4. యెషయా యిర్మీయా యిద్దరూ మహా ప్రవక్తలే. ప్రభువు ఇద్దరినీ బాల్యప్రాయంలోనే ప్రవచనం చెప్పడానికి పిల్చాడు. యెషయా ధైర్యవంతుడు, యిర్మీయా పిరికివాడు. దేవుని పిలుపు విన్పింపగానే యెషయా “ప్రభో! నేను సిద్ధంగానే ఉన్నాను. నన్ను పంపు" అన్నాడు. కాని యిర్మీయా “ప్రభో! నేను బాలుణ్ణి. నాకు మాటలాడ్డం చేతకాదు. ఇంకెవరినైనా పంపుకో" అన్నాడు. యెషయాకు ముందుకుపోయే గుణముంది. యిర్మీయాకు జంకే గుణముంది. కాని ప్రభువు ఈ ప్రవక్తలిద్దరికీ తన శక్తిని ప్రసాదించి యిద్దరినీ తన పనికి నియోగించుకొన్నాడు - యెష 6,8 ; యిర్మీయా 1,6.
5, ఓ సేవకుడు తన యజమానునికి లక్షల వరహాలు అప్పుపడ్డాడు. అయినా యజమానుడు జాలిపడి అతని యప్పును క్షమించాడు. ఈ సేవకునికి యింకో సేవకుడు కొన్ని రూకలు అప్పుపడ్డాడు. అయినా ఆ సేవకుడు అప్పుపడిన తన దాసుణ్ణి క్షమింపక వాని గొంతు పట్టుకొన్నాడు. అప్పు తీర్చిందాక యిక్కడే ఉండమని అతన్ని చెరలో త్రోయించాడు. అదిచూచి యజమానుడు మొదటి సేవకుణ్ణి కఠినంగా శిక్షించాడు. "నీచుడా! నేను నీ యప్పు మన్నించినట్లే నీవూ నీ తోడిదాసుని యప్పు మన్నించవద్దా?" అని గద్దించాడు. మనం భగవంతునినుండి క్షమాపణం పొందాలి అంటే మన తోడిజనాన్ని క్షమించడం నేర్చుకోవాలి. కొంత మందిలో క్షమించే గుణముంటుంది, కొంత మందిలో ఉండదు - మత్త 18,32-33. 

6. పదిమంది కన్నెలు దివ్వెలు తీసికొని రాత్రిలో పెండ్లికుమారునికొరకు వేచివున్నారు. వాళ్లల్లో ఐదుగురు తెలివైనవాళ్ళ వాళ్ళదగ్గర నూనెవుంది. పెండ్లి కుమారుడు రాగానే వాళ్ళ తమ దివ్వెలు వెలిగించుకొని అతనితోపాటు వివాహ శాలలోనికి వెళ్లారు. మిగిలిన అయిదుగురు తెలివి తక్కువవాళ్లు. వాళ్లవద్ద నూనె లేదు. అపరాత్రిలో పెండ్లికుమారుడు రాగానే ఆ కన్నెలు చమురుకోసం అంగడికి వెళ్లారు. కాని వాళ్లు తిరిగి రాకముందే వివాహశాలను మూసివేసారు. ప్రభువు ఎప్పుడు విజయం చేస్తాడో మనకు తెలీదు. అతడు వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవాళ్లు అతని వెంట పరలోకానికి వెళ్లారు. కాని అలా సిద్ధంగా ఉండేవాళ్లు కొందరు, ఉండనివాళ్లు కొందరు. - మత్త 25,1-13.

7. పేత్రూ యూదా యిద్దరూ ఘటోరపాపంచేసారు. పేత్రు ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకాడు. అయినా అతడు ఆశాభావంతో పశ్చాత్తాపపడ్డాడు. తన పాపానికి