6. ఓ తడవ శిష్యులు కపెర్నహూము అనే వూరికి వెళూన్నారు. వాళ్ళ త్రోవలో నేను గొప్పంటే నేను గొప్పని తమలోతాము వాదోపవాదాలు చేసికొన్నారు. ఆ వూరు చేరినంక క్రీస్తు వాళ్ళనుజూచి మీలో మీకు వివాదమెందుకు పుట్టిందని ప్రశ్నించాడు. వాళ్ళు నిజం బయటపడిందని తెలిసికొని సిగ్గుతో తలలు వంచుకొన్నారు - మార్కు9, 33-35.
7. శిష్యులు క్రీస్తురాజ్యమొకటుందనీ, అక్కడ తమకు గొప్ప పదవులు లభిస్తాయనీ అపోహపడేవాళ్లు కనుక వాళ్లు క్రీస్తుదగ్గరకివచ్చి పరలోకరాజ్యంలో ఎవడు గొప్పవాడౌతాడో చెప్పమని అడిగారు. ప్రభువు శిష్యులు పదవీవ్యామోహం గుర్తించి వాళ్ళకు ఓ చిన్నబిడ్డను చూపించాడు. ఈ చిన్న బిడ్డలా తన్నుతాను తగ్గించుకొనేవాడే పరలోకరాజ్యంలో గొప్పవాడౌతాడని బోధించాడు. దేవుని యెదుట రాణించేది మన పెద్దరికం కాదు, అణకువ — మత్త 18, 1-5.
8. ఒకమారుపేతురు యోహాను సమరయ పట్టణానికి వచ్చారు. అంతకుమందే ఫిలిప్ప అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. పేతురు యోహాను అక్కడి జనులమీద చేతులు చాచగా వాళ్లు పరిశుద్దాత్మను పొందారు. ఆ పట్టణంలో మంత్ర విద్యలో మెప్పవడసిన సిమోననే అతడు ఉన్నాడు. అతడు పేతురు, యోహాను, ఫిలిప్ప శిష్యులకు పరిశుద్ధాత్మను ఈయడం చూచాడు. తానూ ఆ యాత్మను సంపాదిస్తే ఇతరులకు డబ్బుకు అమ్ముకోవచ్చుగదా అనుకొన్నాడు. కనుక అతడు అపోస్తలుల మందు కొంతడబ్బుపెట్టి నాకుకూడ ఈ యాత్మను సంపాదించే శక్తినీయండని కోరాడు. అప్పడు పేత్రు నీవు డబ్బుపెట్టి దేవుని వరాన్ని కొనగలవా అని అతన్ని చీవాట్లపెట్టి పంపాడు - అచ 8, 17-24.
9. కోపం
మనం సులభంగా కోపానికి వశులమైపోతాం. కోపం వచ్చినపుడు మంచిచెడ్డలుకూడ మరచిపోయి చేయరాని పనులు చేస్తాం. తర్వాత తెలివివస్తుంది. కాని చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటే యేమిలాభం?
1. దేవుడు తమ్ముని కానుకను అంగీకరించి తన కానుకను నిరాకరింపగా కయీనుకు విపరీతమైన కోపర వచ్చింది. అతడు హేబెలును పొలానికి తీసికొనివెళ్ళి అక్కడ అతన్ని చంపివేసాడు - ఆది 4, 3–8.
2. యాకోబు యేసావునకు రావలసిన తండ్రి దీవెన మోసముతో తాను కొట్టేసాడు. కనుక ఏసావు యాకోబుమీద పగబట్టాడు. తండ్రి యీసాకు మృతినిగూర్చి