పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశపుట్టింది. అవి కంటికింపుగా వున్నాయి. నోటికి రుచిగా కూడ వుండవచ్చు. తామూ ఆ పండ్లతిని మంచిచెడ్డలు తెలిసికొని దేవుళ్లిపోతే ఎంతబాగుంటుంది అనుకొంది. దేవుళ్లు కావాలన్న కోర్కెతోనే ఆదామేవలు తినరానిపండ్లు తిన్నారు - ఆది 3, 5-6

2. కోరా మరియు అతని యనుచరులూ మోషే అహరోనుల్లాగ యాజకులు కావాలనుకొన్నారు. కనుక వాళ్లు మోషే అహరోనులమీద తిరగబడ్డారు. ఇంకా దాతాను ఆబీరాము అనేవాళ్లు మోషే అహరోనుల్లాగ ప్రజానాయకులు కావాలనుకొన్నారు. కనుక వాళ్లగూడ ఆ యన్నదమ్ములమీద తిరగబడ్డారు. అపుడు మోషే దేవుని ప్రార్ధింపగా నేల నోరువిప్పి తిరుగుబాటుదారులందరిని బ్రిమింగివేసింది - సంఖ్యా 16, 31-32.

3. అబ్సాలోమునకు తండ్రి దావీదునకు బదులుగా తాను రాజకావాలన్న బుద్ధిపట్టింది. అతడు రథాలూ గుర్రాలూ చేకూర్చుకొని వైభవంగా తిరగడం మొదలెట్టాడు. ఏబైమంది బంటులు ముందునడచి అతనికి బరాబరులు చేస్తూండేవాళ్లు, అతడు నగర ద్వారంవద్ద నిలుచుండి వస్తూపోతూండేవాళ్ళను ఆప్యాయంగా పలుకరించి వాళ్ళమన్ననలను సంపాదించాడు. తరువాత అబ్వాలోము దావీదును తరిమేపి తాను రాజయ్యాడు. కాని దావీదు అనుచరులు అతన్ని యుద్ధంలో ఓడించి చంపివేసారు - 2సమూ 15, 1-6.

4. యూదులు బాబిలోను ప్రవాసంలో వుండగా వాళ్ళ ఆడపడచు ఎస్తేరు ఆ దేశపు రాజును పెండ్లి చేసికొని రాణి ఐంది. ఆ దేశపు రాజుకు మంత్రి హామాను. యూదులనాయకుడు మొర్దేకయి. ఇతడు ఎస్తేరురాణికి బంధువు. హామానుకు మొర్దేకయి పాలకవ గిట్టదు. ఓమారు హామాను రాజు కొలువునకు వసూండగా మొర్దేకయి రాజభవన ద్వారం వద్ద కూర్చుని వున్నాడు. కాని అతడు పైకిలేచి నమస్కారంగూడ చేయలేదు. కనుక హామాను మొర్దేకయిని హతమార్చాలనుకొన్నాడు. అతడు భార్యతో మిత్రులతో సంప్రతించి మొర్దేకయిని ఉరితీయించడానికికై ఏబదిమూరలు ఎత్తుగల ఉరికంబాన్ని సిద్ధం చేయించాడు. కాని చివరకు హామానునే ఆ కంబంమీద వరితీసారు - ఎస్తేరు 5, 12-14.

5. జబదెయి కుమారులు యాకోబు యోహానులు. వీరి తల్లి క్రీస్తుకు బంధువరాలు. ఒకతడమ ఆమె కుమారులను వెంటబెట్టుకొని క్రీస్తువద్దకువచ్చి కుమారులిద్దరూ నీ రాజ్యంలో కుడియెడమల కూర్చుండేలా చేయమంది. అనగా వాళ్ళిద్దరికి అందరికంటె పై యుద్యోగాలు లభించాలని ఆమె కోరిక. క్రీస్తు వాళ్ళను జూచి మీరు నా బాధల్లో పాల్గొనగలరా అని అడిగాడు. వాళ్ళ ఏమి తెలియక పాల్గొంటామని తలలూపారు. క్రీస్తు వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించి "నా రాజ్యంలో కుడియెడమలందు కూర్చుండే అధికారం నా తండ్రి అనుగ్రహించిన వాళ్ళకేగాని లభించదు" అని చెప్పాడు. తరువాత మిగిలిన పదిమంది శిష్యులూ ఈ సంగతంతా విని యాకోబు యోహానులను చీవాట్లు పెట్టారు - మత్త 20, 20–24.