3. పొరపాటు చేయని వరం ఏయే అంశాలకు వర్తిస్తుంది?
పోపుగారి వరం లౌకికాంశాలకు వర్తించదు. వాటిని గూర్చి ఆయన అధికారపూర్వకంగా ప్రకటనలు చేయడు. పొరపడనివరం విశ్వాసరంగానికీ నైతికరంగానికీ మాత్రమే వర్తిస్తుంది. మనకు దేవునితో సంబంధం కలిగించే ప్రధాన రంగాలు ఇవే. నేరుగా మన రక్షణకు సంబంధించినవి కనుక పోపుగారు ఈ యంశాలను గూర్చి మాత్రమే మాట్లాడతారు.
ఈ యంశాలు మామూలుగా బైబుల్లోను పారంపర్య బోధలోను తగులుతాయి. కనుక పోపుగారు బైబులు పారంపర్య బోధలను గూర్చి, వాటితో సంబంధమున్న ఇతరాంశాలనుగూర్చి మాత్రమే అధికారపూర్వకంగా ప్రకటనలు చేస్తారు. వీటిని మనం మనఃపూర్వకంగా అంగీకరించాలి.
పోపుగారు విశ్వాస నైతికాంశాలను గూర్చి అధికారపూర్వకంగా ప్రకటనలు చేసినపుడు బిషప్పల బృందానికి శిరస్పుగానే మాటలాడతారు. ఈ బిషప్పల బ్నందం తిరుసభకంతటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక ఆయన తిరుసభ తరపుననే తిరుసభకు బోధచేస్తారు. ఒకవైపు ఆయ క్రీస్తుకి ప్రతినిధి. క్రీస్తు ప్రతినిధిగా ఆయన క్రీస్తు సమాజానికి బోధ చేస్తారు. మరోవైపున ఆయన తిరుసభకు ప్రతనిధి. తిరుసభ ప్రతినిధిగా ఆయన తిరుసభ విశ్వాసాన్నే ప్రకటిస్తారు. పోపుగారి బోధవేదసత్యం మాత్రమేకాదు. విశ్వాసప్రకటనం గూడ.
ఒకమారు పోపుగారు ప్రకటనం చేసిన వేదసత్యం ఇక యేనాటికీ మారదు. అనగా ఆ యంశంలోని సత్యం శాశ్వతంగా నిలుస్తుంది. కాని భావితరాలవాళ్ళ ఆ వేదసత్యాన్ని భిన్నపదాలతో భిన్నరీతుల్లో ప్రకటించవచ్చు మొదటిసారి చెప్పిన దానికంటె ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు. ఆయా కాలాల అవసరాలను బట్టి ఈ మార్పు అవసరమౌతుంది. కనుక వేదసత్యం మారదు. ఆ సత్యాన్ని చెప్పే తీరు మారవచ్చు
4. సమైక్యతరీత్యా సమస్యలు
సమైక్యరీత్యా చూస్తే ప్రొటస్టెంటు క్రైస్తవులు పోపుగారికి పొరపడని వరంవుందని అంగీకరింపరు. ఈ వరంద్వారా పోపుగారికి బైబులును మించిన అధికారం లభిస్తుందని వాళ్ళకు భయం. లూతరు భావాల ప్రకారం, పోపుగారు ఎక్యుమెనికల్ సభలు కూడ పొరపాట్లు చేయవచ్చు. కాని ప్రొటస్టెంట్ల తిరుసభకు మాత్రం ఈ వరం వుందని నమ్ముతారు.