పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన ఇరెనేయస్ అనే వేదశాస్త్రి వ్రాతల ప్రకారం తిరుసభ అధికారుల్లో పీఠాధిపతి ముఖ్యమైనవాడు. ఇతడే అపోస్తలులు స్థాపించిన తిరుసభకు వారసుడుగా వుండేవాడు. ఇతని ద్వారానే ఆయా క్రైస్తవ సమాజాలు తొలి అపోస్తలులు స్థాపించిన ఆదిమ తిరుసభతో సంబంధం కలిగివుండేవి. ఈ వేదశాస్త్రి రోము పీఠాన్ని పరిపాలించిన పీఠాధిపతుల జాబితాను కూడ తయారుచేసి వాళ్ళు తొలి పండ్రెండుమంది అపోస్తలుల తర్వాత కొనసాగుతూ వచ్చినవాళ్ళని చెప్పాడు. ఈలా పీఠాధిపతుల స్థానం క్రమేణ ప్రాముఖ్యంలోకి వచ్చింది.

ప్రార్ధనా భావాలు

1. తిరుసభలో మూడు భాగాలున్నాయి. ఈ లోకంలో వున్నది యుద్ధ తిరుసభ. ఇది పిశాచంతో పోరాడేది. మోక్షంలో వున్నది విజయ తిరుసభ. ఉత్తరించే స్థలంలో వున్నది బాధామయ తిరుసభ. ఈ మూడు భాగాలకు పరస్పర సంబంధం వుంది. మోక్షంలోని భక్తులు తమ ప్రార్థనల ద్వారా ఈలోకంలో పోరాడే మనకు సాయం చేస్తుంటారు. మోషే యీస్రాయేలీయులు కొరకు ప్రార్ధన చేసాడు. సైఫను తన్ను హింసించేవారి కొరకు జపించాడు. తుఫానులో చిక్కిన పౌలు ఓడలోని తోడి ప్రయాణికుల కొరకు మనవిచేసాడు. కాని ఈ భక్తులంతా మోక్షానికి వెళ్లాక తమ ప్రార్థనను మానివేయరు కదా! కనుక మోక్షంలోని వాళ్ళమన కొరకు జపిస్తారు. మన తరపున మనం నమ్మకంతో వారి ప్రార్థనా సహాయాన్ని అడుగుకోవాలి.

2. మోక్షంలోని అర్యశిష్ణులను పూజించడం వలన ఈ లోకంలోని తిరుసభకు మూడు లాభాలు కలుగుతాయి. ఆ భక్తులు తమ పుణ్యజీవితం ద్వారా మనకు ఓ మంచి ఆదర్శాన్ని చూపిస్తారు. ఈ భూమిమిూద వున్న మనకు మోక్షంలోని పునీతులతో సహవాసం లభిస్తుంది. వాళ్లు తమ ప్రార్థనల ద్వారా మనకు సహాయం చేస్తారు.

10. పీఠాధిపతులు

గృహస్తులూ గురువుల తర్వాత పీఠాధిపతులను గూర్చి చెప్పాలి.

మొదటి వాటికన్ సభ పోపుగారి పదవిని గూర్చి సవిస్తరంగా బోధించిందిగాని పీఠాధిపతులను గూర్చి ఏమి చెప్పలేదు. రెండవ వాటికన్ సభ బిషప్పుల అధికారాన్ని గూర్చి సవిస్తరంగా బోధించింది. ఈ సభ ముఖ్యబోధల్లో బిషప్పుల అధికారంకూడ ఒకటి. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.