పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ మూడంతస్తులులేవు. అవి క్రమేణ పరిణామం చెందాయి. కాని ఈ పరిణామం క్రీస్తు కోరికను అనుసరించే జరిగింది.

1. క్రీస్తు గురుత్వంలోని మూడు మెట్లను స్వయంగా స్థాపించలేదు. అతడు అపోస్తలులనే గురువులుగా నియమించాడు. 2.క్రీస్తు అభిమతం ప్రకారమే ఈ గురుత్వం క్రమేణ మూడు మెట్లుగా పరిణామం చెందింది. అతడు అపోస్తలులతో పాటు 72 శిష్యులను గూడ ఎన్నుకొన్నాడు. దివ్యసత్ర్పసాదాన్నిగూడ స్థాపించాడు. కనుక గురుత్వం ఏక శాఖగా కాక భిన్న శాఖలుగా వుండాలని అతని కోరికై వుండవచ్చు. 3.క్రీస్తు ఉత్థానానంతరం అతడు స్థాపించిన గురుత్వం మూడు శాఖలుగా పరిణామం చెందింది. ఆనాటి తిరుసభ అవసరాలను బట్టి ఈ పరిణామం అవసరమైంది. పైగా తిరుసభలో నెలకొనివున్న ఆత్మ ప్రేరణం ద్వారానే ఈ పరిణామం జరిగింది. మనకు తెలిసినంతవరకు ఈ పరిణామం వివరాలివి.
అపోస్తలులతోపాటు కొందరు పెద్దలుకూడ యెరూషలేములో సమావేశమై ఆనాటి తిరుసభలో నిర్ణయాలు చేసారు - అచ.15,22. తిమోతి తీతు జాబుల్లో తొలినాటి తిరుసభ అధికారుల్లో పర్యవేక్షకులు (ఎపిస్కోపోయి)పెద్దలు (ప్రెస్బితెరోయి)పరిచారకులు (డియాకొనోయి) అని మూడు వర్గాలవాళ్లు కన్పిస్తారు. పర్యవేక్షకులు పెద్దలు సరిసమానమైన అధికారాన్ని నిర్వహించినట్లు కూడ తెలుస్తుంది. అనగా వారి పదవులు సరిసమానమైనవి. వీళ్లుగాక ఇంకా ప్రవక్తలు బోధకులు అనే వాళ్లుకూడ తిరుసభలో వుండేవాళ్లు.
క్రీ.శ.95లో క్లెమెంటు అనే తిరుసభ అధికారి తాను వ్రాసిన జాబులో పర్యవేక్షకులు పెద్దలు అపోస్తలులకు వారసులు అని చెప్పాడు. అనగా అప్పటి తిరుసభలొని వివిధాధికారుల్లో ఈ వుభవయ వర్గాలవాళ్ళు ముఖ్యులు అనుకోవాలి.
క్రీ.శ.110 ప్రాంతంలో అంటియోకయ బిషప్పయిన ఇగేష్యస్గారు చాల జాబులు వ్రాసారు. ఈ జాబులు పైన మనం పేర్కొన్న పర్యవేక్షకులను తిరుసభలోకెల్ల ఉన్నతాధికారులుగా వర్ణిస్తాయి. అనగా అప్పటికల్లా పర్యవేక్షకులు అనబడేవాళ్లు పీఠాధిపతులు అయ్యారు. పెద్దలు అనబడేవాళ్లు వాళ్లక్రింద పనిచేసే గురువులయ్యారు. పరిచారకులు అనబడేవాళ్లు మూడవ అంతస్తులో వున్నారు. ఇగ్నేప్యస్ గారు'ఒక్క దివ్యసత్ర్పసాదం, ఒక్క పాత్రం, ఒక్క బలిపీఠం, పెద్దల బృందంతోను పరిచారక బృందంతోను కూడిన పీఠాధిపతి" అని వ్రాసారు. కనుక ఆనాడు ఒక్కోపీఠాధిపతి ఆధీనంలో ఓ గురు బృందమూ ఓ పరిచారక బృందమూ పనిచేస్తూ వుండివుండాలి. ఈ రీతిగా "ఇప్పటి పీఠాధిపతులు గురువులు పరిచారకులు అనే మూడంతస్తుల క్రమం రెండవ శతాబ్దం ప్రారంభంలో ఏర్పడింది.