పుట:Andhraveerulupar025958mbp.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంచములకంటె నితరాగ్రవర్ణులే విశేషించి పూజించుచున్నారు. దేశభక్తి, బలపరాక్రమములు, పితృభక్తి, ధర్మనిష్ఠ, సేవాదీక్ష లోనగు మానవ ధర్మములను నిర్వహించుటలో నసమానుడగుకన్నమనేని యాదర్శములు ఆంధ్రలోకమునకు మార్గదర్శక మగుగాక!

[ఆంధ్రమంత్రులు అను గ్రంథమునందలి బ్రహ్మనాయని చరిత్రము, ఆంధ్రవీరులు మొదటిభాగమునందలి బాలచంద్రుడుఅను వీరులచరిత్రము బఠించినచో గన్నమనేని చరిత్రమునందు సూచింపబడిన ప్రధానకధాంశములు ద్యోతకమగును.]

________

వేమారెడ్డి

ఆంధ్ర రాజులలో రెడ్డివారు ప్రధమగణ్యులు. స్థానాం -- ములం దుంటచే వీరు జాతిసాంకర్యములు కలుగకుండుటకు దమశాఖను బెక్కుఉపశాఖలుగా విభజించి యందుండి గుంపులని చిన్నతెగల విడదీసి సంబంధ బాంధవ్యములు జరుపుకొనుచున్నారు. వీరలు చిరకాలమునుండి ఆంధ్రదేశమునందు నివసించి కాకతీయ సామ్రాజ్యము మహోన్నత దశయందున్నపుడె స్వతంత్రరాజులుగ సేనాధీశ్వరులుగా నుండి క్రమ