పుట:AndhraRachaitaluVol1.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మువ్వురు మేనమామలయుపోలిక నాయెడ గూడి వచ్చినం
బువ్వులబాట లంచనడపుల్ గద ! మత్కవితా చిరంటికిన్.

పొరలున్ - పోరులు లేక భావములు పూవుల్ తావులైహత్తు మూ
వురు మేనత్తల కూర్మిలో గరంగిపోవు న్నామన; స్సంతలో
బిరుసుల్వోవును బెద్దయల్లుదనపుంబింకమ్ము; నా కంతలో
భరమైపోవును వారివారి యమృత స్వాదూర్తి మర్యాదలున్.

వేడ్క దాతయ్య కూర్చున్న వీధియరగు
పండ్ల బరువున నొరగు కల్పద్రుమంబు
చేరి మామయ్య లొదుగు దక్షిణపువైపు
పోకంరాకులు, తములపుటాకు దోపు.

విందులకో మందులకో
యెందులకో పేరుచెప్పి యేతెంచు హితుల్
బందుగులు నిత్యమును బది
మందిగదా, వారి సదన మాధురి యదిరా !

మఱియొక ముచ్చట - అచ్చట
బఱిచిన భోజనపు బంక్తి పరికింపవలెన్
వరికళ్ళము చేరిన పా
పురముల వలె వచ్చి మెసవి పోదురు నిసువుల్.

కొడుకులు మన్మలుం జిఱుత కుఱ్ఱలు బందువు, లల్లువారు, పే
ర్వడిన కవుల్ ప్రియాతిథులు పర్విన చుక్కలబంతిలోన జం
ద్రుడు వలె "గందమక్షతలతో" గళతో-నభిరామమూర్తి యే
ర్పడ నమృతన్నపుం జవులు పట్టును తాతయ, యెట్టి ధన్యుడో !

ఎనుబది యేండ్లకున్ దరికి నొక్కి తొనంకిసవాడు తాత - జ
వ్వనముననుండి పెంపుగనువాడగు నీమనుమండుకూడ - ని