పుట:AndhraRachaitaluVol1.djvu/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయ విలాసుని వినుతింప దలచిన

జక్కన కోరమీసాలుదువ్వె

జక్కన్న కవనంబు చక్కనిదని పల్క

పినవీరకవి పల్కువెలదికిమగ డన్న

గండ పెండారంబు ఘల్లు మనియె

పెద్దన్న కవితకు బెదతాత యనిపల్క

రామభూషణు డంబరంబు సూచె

భట్టు మూర్తికి గవిరాజుపట్ట మీయ

తిట్టి లింగడు చేపల బుట్ట సూపె

నందఱందఱు మహనీయు లని తలంచి

యొక నమస్కార మొనరించి యూరకుంటి.

               *

కరుచైపోయిన వీరలోకమునకై కన్నీరు వర్షించుచున్

గరముల్ మోడుచు మందభాగ్యదశ కింకన్ దావు లేకుండగా

దొరకె న్మాకు విచిత్ర ద్విగ్విజయ వస్తుశ్రేణి బాపూజిచే

తరమే మమ్మెదిరింప నన్నులకు ఛత్రగ్రహి ఖండాళికిన్.

"స్వయంవరము"

               *

ఆడంగుల్ కలవారి తొయ్యలు లనూర్యంపశ్యలై, హాయిగా

మాడీలం బరదాలలో మెరయు శంపావల్లులై యొప్పగా

నాడుం గొండల కోనలన్ గృషికకాంతల్ మూవులం బావల

ల్లాడుం గష్టము చేయు దృశ్యములు నాయాత్మం బ్రపీడించెడిన్.

"కాందిశీకుడు"

                 *