పుట:AndhraRachaitaluVol1.djvu/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. షడ్డకులు పోరుచో భూ

రాడ్డమ్మున నుడువనేగు రభసమ్మున నౌ

నడ్డాక దెగుడు మెడగొను

వడ్డాణ మలంకరించె వనితకుచములన్.


శ్లో. అహో మధువసంచయ; కవికులాధినాథం సదా

పదప్రచర ఉత్పతన్ హరిగ తావధానస్థితమ్,

కరోతి యది చేత్తి రస్కృతి మిహాఘయుక్తే కతా

కుళీరకుహరే కరీ పరిలునాతి పంచాననం


బాలాత్రిపురసుందరీ దేవతోపాసకు డగుటచే నీకవివరు డన్నమాట విధిగా జరిగెడిదని కొన్నాళ్ళక్రిందటి వాడుక. అదియటులుండ, శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును మదరాసులో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయినది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.


ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము.

                        ______________