అని అందరూ పాడినారు.
“అమ్మా కప్పవే
అదరిపాటే నాకు
ఏదో భయమౌతాది
ఎటుపోవనే నేను!"
అని ఒక మూడేళ్ళబాలిక పాడింది.
“భయ మెందుకమ్మా?
బాలలార మనకూ భ
యమెందుకమ్మా ?
జయ మొందు శుభ
శకునమాయె అదుగొ
మగువలార మధు
మాసరాజు లేడ!
భయమెందుకమ్మా?
దూరమందు ఏదో
తొగరురంగు తోచే
చిట్టిపాప బోసి
చిన్నారి పెదవిపై
భయమెందుకమ్మా?"
ఆ ముగ్గురు బాలలు నాట్యం పూర్తిచేయగానే, ఎఱ్ఱనిమొగ్గలుగల లతలు అలంకరించి బంగారురంగు వస్త్రాలు ధరించిన పన్నెండు సంవత్సరాల బాలికలు ఎనమండుగురు నలువైపులనుంచీ నాట్యమాడుతూ ప్రవేశించారు. వారి వెనుక బాలురు పది పన్నెండు సంవత్సరాలవారు ఎనమండు గురు తెల్లని మొగ్గలతో లతలతో అలంకరించినవారు ఎనమండుగురు నీల వస్త్ర శోభితులు వచ్చిన్నారు. ప్రతివానిచేతిలో ఒక బొమ్మనాగలి ఉంది. ప్రతి బాలిక చేతిలో రంగులతో అలంకరించిన మృత్తికాకలశ మొకటి ఉన్నది.
బాలికలు : దిశలమమ్మా మేము
దెసల బాలికలం
బాలురు: దెసలకై ఎదురేగు
పసుల కాపులమూ
మేము
మిసిమి భూమినిదున్న
మేటి హాలికులం!
మేము
హాలికులం
అడివి బాపిరాజు రచనలు - 6
147
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)