వరదలు పొర్లి వచ్చినట్లు, విరుచుకు పడినట్టు, నెమ్మదిగా ప్రవహించినట్టు వస్తున్నది. ఉన్నట్టుండి ఒక దినం తన తండ్రి మహాసభలో పాడిన ఒక మహాకవి పద్యము ఆమె ఎదుట తోచినది.
“ప్రేమ అన్నది ఒకదివ్య ధామమగును
ప్రేమికు లనిమిషులు వారి వీక్షణములె
తపము, చుంబనములె అమృతము, బళిర
అద్భుతాలింగనమె వారి యజ్ఞఫలము"
ఈ పద్యము చదువుకొని ఆమె తెల్లబోయింది. తెరవెనక నర్తకిలా భావము వ్యక్తావ్యక్తమై ఆమెకు తోచినది. ఆమె “బ్రహ్మదత్తప్రభూ! ఈ ఆవేదనాపూర్ణాలయిన సంశయాలను మీరే పరిష్కరించాలి” అనుకొన్నది వెంటనే ఆమె హృదయము అతివేగంగా స్వనించినది. ఆమె కేదియో ధైర్యము కలిగింది. ఆమె తన భవనంచేరి అంతఃపుర రక్షకురాలిని పిలిచింది.
“నువ్వు మన అంగరక్షకదళములు రెంటిలో ఒకటి సిద్ధం చేయించు. భవన రక్షకదళాలు మూడింటిలో రెండు సిద్ధంచేయించు. రథాలు, ఏనుగులు మహారాజుగారిని నే నర్జించినట్లు వారికి ఇదిగో నా చిటికెనవేలి ఉంగరము ముద్రవేసిన అభ్యర్ధనము కొనిపో! రేపు ఉదయం మన చిన్నసైన్యం ప్రయాణానికి అనుమతికోరు. పులమావితో యుద్ధానికిపోయిన మనసైన్యాలను, ముఖ్యంగా మా గురువుగారిని, కలుసుకోడానికి వెడుతున్నానని వారికి మనవిచేయి” అని ఆ బాలిక మహాసామ్రాజ్ఞిలా ఆనతి ఇచ్చింది. చిన్నతనాననుండీ ఆ బాలికను తల్లిలా పెంచిన ఆ అంతఃపుర పాలకురాలు తెల్లబోయి “చిత్త” మని మాత్రమనగలిగినది. శాంతిశ్రీ తన విద్యామందిరము లోనికిపోయి చిరునవ్వు నవ్వుకొంటూ అప్పుడప్పుడు ఆశువుగా,
“యుద్ధమేమిటి వ్యూహమేమిటి?
యుద్ధమున మారణము లెందుకు?
శత్రువేమిటి మిత్రుడేమిటి
జీవజాలములో?
“విజయ మెందుకు ఓట మెందుకు?
విజయ మొందగ సైన్యమెందుకు?
సైన్య ముఖమున రథములెందుకు
అశస్త్రాలున్?
“చంపువా డెవ్వండు? వానికి
చంపబడు నావీరవరునకు
చావునకునూ బ్రతుకునకునూ
భేద మేముందో?
“గురువొక్క డే తీర్చగల డీ
బరువెక్కిన హృదయ వేదన,
నరునిపొదివిన కష్టజాలము
కర్దమేముందో?”
అడివి బాపిరాజు రచనలు - 6
139
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)